స్వర్గీయ అంజిరెడ్డి స్థాపించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలంగాణలో చదువుకోవాలని ఆసక్తి వున్న విద్యార్థులకు ఉపాధితో అండగా నిలుస్తూనే.. వారిని ఉన్నత విద్యను అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఈ సారి సంగారెడ్డి జిల్లాలో చేపట్టనుంది. చదువులో ఉత్సాహం, ఆసక్తి కనబర్చిన ఇంటర్ విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశం అందిస్తోన్న సంస్థ.. అదే సమయంలో వారిని ఉన్నత విద్యను (ఫార్మక్యూటికల్ కెమిస్ట్రీ)లో డిగ్రీ చదివించి.. పట్టాను అందుకోవడంలోనూ దోహదపడుతోంది.
ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.వి. జూనియర్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేరకు సంగారెడ్డి ఎస్ వి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పి.రామకృష్ణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాలకు 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తెలుగు భాషపై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గోనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
18 - 20 మధ్య వయస్సు గల విద్యార్థులను రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకొని డా. రెడ్డీస్ లాబొరేటరీస్ వారు బిట్స్ పిలాని హైదరాబాద్లో డిగ్రీ చదివిస్తూ (ఫార్మక్యూటికల్ కెమిస్ట్రీ), ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని, తగిన వేతనం కూడ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలతో పాటు ఆధార్ కార్డు పత్రాలతో, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9849477450, 9290434597, 8096454622, 9440362346 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more