మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏంటన్న విషయంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇందుకు భూలావాదేవీలు కారణమా.? లేక కడప పార్లమెంటరీ స్థానం కారణమా.? అన్న కోణాలతో పాటు దాదాపు అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన సీబిఐ ఇప్పటికే తొలి చార్జిషీటును న్యాయస్థానంలో దాఖలు చేసింది. గతేడాది అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సిబిఐ సమర్పించిన చార్జిషీటు తాజాగా వెలుగుచూసింది. కాగా, వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలకు ప్రమేయం ఉందని సిబిఐ వారిపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంట్లో వాచ్మన్గా పనిచేసే బి. రంగన్న మేజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వై.ఎస్.వివేకా ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్.. కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని వివేకా ఇంట్లో వాచ్మన్గా పనిచేసే బి.రంగన్న వెల్లడించారు. ఆయన సెల్ఫోన్లో బ్యాలెన్స్ లేదంటూ.. తన ఫోన్ నుంచే రాజశేఖర్కు కాల్ చేసి మాట్లాడించారని తెలిపారు.
అయితే రాజశేఖర్ తనతో మాట్లాడుతూ.. మార్గమధ్య దారిలో తన బండి (వాహనం) చెడిపోయిందని, మరమ్మతులు చేయించుకుని కాణిపాకం ఎప్పుడు చేరుతానో తెలియదంటూ రాజశేఖర్ సమాధానమిచ్చిన తర్వాత.. గంగిరెడ్డి ఆ ఫోన్ కాల్ కట్ చేసి సెల్ను తనకు ఇచ్చేశారని వివరించారు. 2019 మార్చి 14 ఉదయం ఈ ఘటనలు చోటుచేసుకోగా.. అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట గతేడాది జులై 23న రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. ప్రధానాంశాలివే.. తనను నరికిచంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడటంతోనే తాను ఎవరికీ ఈ విషయాలు చె్ప్పలేదని అన్నారు.
‘హత్య జరిగిన రోజు రాత్రి వివేకా పడక గదిలో నుంచి ఇనుప సామాన్ల శబ్దం వచ్చింది. అంతలోనే ‘ఆ.. ఆ..’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఆ సమయంలో వివేకా పడకగదిలో నుంచి హాల్లోకి ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరితో పాటు మరో వ్యక్తి పదే పదే తిరుగుతూ కనిపించారు. అరుపులు వినిపించిన 20 నిమిషాల తర్వాత ఎర్ర గంగిరెడ్డి మినహా మిగతా ముగ్గురూ పారిపోయారు. తర్వాత కొద్దిసేపటికి ఎర్ర గంగిరెడ్డి ఆదరాబాదరాగా బయటకు వచ్చాడు. లోపల ఏం జరిగింది? వారు ముగ్గురు ఎందుకు పారిపోయారని ఆయన్ను ప్రశ్నించగా, ‘నీకెందుకు..ఎక్కువమాట్లాడితే నిన్ను నరుకతా’ అన్నారు.
2019 మార్చి 15న ఉదయం ఎర్ర గంగిరెడ్డి నన్ను పిలిచి.. రాత్రి జరిగింది ఎవరితోనైనా చెబితే నరికి పారేస్తానని బెదిరించారు. దాంతో తాను భయపడి ఎవరికీ చెప్పలేదు’ అని రంగన్న తన వాంగ్మూలంలో వివరించారు. ‘మీతో ఈ విషయం చెప్పినట్లు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకాను చంపిన వారికి తెలిసిపోయుంటందా? వాళ్లు నన్నేమైనా చేస్తారా?’ అంటూ వాంగ్మూలం ఇచ్చిన సమయంలో రంగన్న మేజిస్ట్రేట్ను అడిగారు. ‘నీ బాగోగులు వ్యవస్థ చూసుకుంటుంది’ అంటూ మేజిస్ట్రేట్ ఆయనకు సమాధానమిచ్చారు. ‘వివేకానందరెడ్డి ధర్మదేవుడు సార్... అలాంటి ఆయన్ను చంపారు. పిల్లోడు పిలిచినా పలుకుతాడు’ అంటూ రంగన్న కొన్ని సెకన్ల పాటు మేజిస్ట్రేట్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టు ద్వారా బుధవారం అందుకున్నారు. వాంగ్మూలంలో పేర్కొన్న వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టి.. మరికొందరు నిందితులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 21న మరోమారు పులివెందుల మేజిస్ట్రేట్ ఎదుట దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపై ఆధారాలు లభిస్తే సీబీఐ మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more