ఒడిశాలోని సంబల్ పుర్ జిల్లాలో ఓ ఫారెస్ట్ గార్డ్ రెండు గ్రామాల ప్రజలను ఏనుగు దాడి నుంచి కాపాడారు. ఏనుగులు అకస్మాత్తుగా తమ గ్రామాల్లోకి ప్రవేశించి పంట పోలాలను నాశనం చేసింది. దానిని తరిమేందుకు వెళ్లిన గ్రామస్థులపై కూడా కోపంతో దాడికి యత్నించింది. అయితే నిరాయుధుడైన ఓ పారెస్ట్ గార్డు మాత్రం తన చేతిలోని కాగడతో దానిని తిరిగి అడవులలోకి వెళ్లేట్లు చేశాడు. దీంతో అతనిపై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ గ్రామాల్లో వందలాది మంది ప్రజలను కాపాడటంతో పారెస్ట్ గార్డ్ కీలకంగా వ్యవహరించారని గ్రామస్థులు పేర్కోంటున్నారు.
అయితే ఇది మాటల్లో చెప్పేంత సులువైన పనికాదు. అడవిలోనే అత్యంత పెద్దదైన ప్రాణి ఏనుగు మాత్రమే దానిని ఎదుర్కోవాలంటే.. ఉక్కు నరాలు, బెదరని గుండె, సమయస్పూర్తి కలిగివుండాలి. ఇక అందులోనూ కోపంతో మీదకు దూసుకువస్తున్న అడవి ఏనుగును నియంత్రించడం అంత తేలికైన పనికాదు. కానీ అటు ఏనుగుకు కానీ ఇటు గ్రామస్థులకు కానీ ఎలాంటి హానీ జరగకుండా.. ఏనుగును అడవుల దారిలోకి మళ్లించడం ఎంత శిక్షకుడైనా సరే.. ధైర్యవంతుడు కూడా అయ్యివుండాల్సిందే. అటువంటి సాహసోపేతమైన ప్రధర్శనతో గ్రామస్థుల పాలిట అప్తుడిగా మారాడు ఆ పారెస్టు గార్డు.
అతను ఓ పారెస్టు గార్డు.. ఆయన పేరు చిట్టా రంజన్ మిరి. సంబల్ పుర్ జిల్లాలోని రెడ్యాఖోల్ అటవీ డివిజన్ పరిధిలో ఓ అడవి ఏనుగు చాంద్చాడి, అంగబిరా గ్రామాల్లోని పంటపోలాలను నాశనం చేస్తోంది. విషయం తెలిసిన గ్రామస్థులు దానిని తరిమేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వెనుదిరగలేదు. అయితే మరింత కోపంతో గ్రామస్థులపైకి దూసుకోచ్చింది. గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. వెంటనే గ్రామస్థులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ గార్డ్ చిత్త రంజన్ మిరి సహా మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు.
అయితే అటవీశాఖ సిబ్బంది ఎటువంటి ఆయుధాలు లేకపోవడంతో గ్రామస్థులు ఖంగుతిన్నారు. గ్రామస్థుల నుంచి పోడువాటి కర్రల తీసుకుని వాటికి ఓ వైపు చివరన.. కాగడలను ఏర్పర్చుకుని నిప్పు అంటించి.. ఏనుగు వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడున్న వారిలో కొందరు ఏనుగు ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేయగానే వెనక్కి పరుగులు తీశారు. కాగా, చిట్టా రంజన్ మాత్రం ఏనుగు ముందుకు వచ్చిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. దానికి మంటను చూపుతూనే వున్నాడు. మంటల దాటికి ఏనుగే వెనకడుగు వేసింది. అంతే అలా వేనక్కు జరగడంతోనే దానిని మంటతో అడువుల మార్గ వైపు తరమివేశారు చిట్టా రంజన్. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more