కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. గత రెండేళ్లుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు తీపికబురు చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలను కూడా అన్ లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. అవి గ్రామీణప్రాంత భక్తులకు అందుబాటులోకి వెళ్లడం లేదని గ్రహించిన టీటీడీ ఇకపై సర్వదర్శన టోక్లన్ల ఆఫ్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని గత నెలలోనే నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఈ మేరకు ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమైన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహార్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు, అయితే కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా గత నెలలో తమ నిర్ణయంపై పున: సమీక్ష నిర్వహించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. గ్రామీణ ప్రాంత భక్తుల కోసం అప్ లైన్ టోకన్లు ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దానిపై ఇవాళ జవహార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై సర్వదర్శన టోకన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక గత రెండేళ్లుగా వర్చువల్ పద్దతిలో కొనసాగుతున్న అర్జిత సేవలను ఇక ప్రత్యక్ష పద్దతిలో కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దర్శన టికెట్లు అమ్మే నకిలీ వెబ్సైట్లు గుర్తించి తొలగిస్తున్నామని, ఇందుకు నకిలీ వెబ్సైట్ల కట్టడికి టీటీడీ సైబర్ విభాగం నిరంతర నిఘా ను పెట్టిందని వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే భక్తులు టికెట్లు పొందాలని ఆయన సూచించారు. తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని ఈవో వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more