కరీంనగర్ లోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కారు ప్రమాదానికి కారణమయ్యిందన్న విషయం తెలిసిందే. అదుపుతప్పి కారు రోడ్డు పక్కన.. కొలిమి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబం వేసుకున్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. అయితే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ ప్రమాదానికి కారణలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడైయ్యాయని తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన కారును మైనర్ బాలుడు నడుపుతుండగా, అందులో అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలిసింది. స్నేహితుల ప్రోత్సాహంతో వేగంగా వెళ్తున్న బాలుడు కారును ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడని, ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి గుడిసెలోకి వెళ్లిందని తేలింది. అంటే ప్రమాద సమయంలోనూ కారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, కారుపై 9 చలాన్లు ఉన్నాయి. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న 16 ఏళ్ల బాలుడితోపాటు 17 ఏళ్ల వయసున్న అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు.
అలాగే, బాలుడికి కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన అతడి తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లుకు వాహనాలను అందించిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని గత కొన్నేళ్లుగా పోలీసులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. నిందితుడైన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వెంట ఉన్న ఇద్దరు స్నేహితులు పదో తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. స్నేహితులైన వీరంతా తరచూ కారులో షికారుకు వెళ్లేవారు. నిన్న కూడా అలాగే కారులో బయటకు వచ్చారు. పొగమంచు కురుస్తున్నా కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలేటర్ను బలంగా తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more