అమెరికాలో నూతన సంవత్సరం 2022లో తొలి మరణశిక్ష అమలైంది. ఓక్లహామ రాష్ట్రంలో డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్ (46) కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. ప్రియురాలి కోసం అతడు చేసిన హత్యలకు గాను ఆయనకు ఈ శిక్షను అక్కడి అధికారులు అమలుపర్చారు. తన ప్రియురాలికి బెయిల్ కోసం డబ్బులు అవసరమై.. తొలిసారిగా దొంగతనం మార్గాన్ని ఎంచుకున్న గ్రాంట్.. ఇందుకోసం ఇద్దరి ప్రాణాలను తీశాడు. ఈ హత్యోదంతం తరువాత నాలుగేళ్లకు న్యాయస్థానం ఆయనకు మరణశిక్షను విధించింది. కాగా పలు విచారణల తరువాత న్యాయస్థానం అదేశాలతో ఆయనకు మరణశిక్షను విధించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే..
2001లో 25 ఏళ్ల వయసున్నప్పుడు గ్రాంట్ ఒక హోటల్ లో దోపిడీకి యత్నించాడు. డెల్ సిటీ మోటెల్ వద్ద ఉద్యోగం కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు అదే హోటల్ కు వెళ్లి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా హోటల్ మేనేజర్, డెస్క్ క్లర్క్ పై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. తన గర్ల్ ఫ్రెండ్ కు బెయిల్ ఇప్పించేందుకు డబ్బు అవసరం పడింది. దానికి దోపిడీని మార్గంగా ఎంచుకున్నాడు. దీంతో 2005లో స్థానిక కోర్టు అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. అప్పటి నుంచి ఎన్నో అప్పీళ్లతో ఆయన తరపు న్యాయవాదులు కోర్టులలో విచారణ సాగిస్తూనే వచ్చారు.
చిన్నతనంలో తండ్రి హింసాత్మక ప్రవర్తనకు గ్రాంట్ బాధితుడని, అతడు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (గర్భవతిగా వున్న తల్లి మద్యం తాగడం వల్ల శిశువుకు కలిగే దుష్ప్రభావం)తో పాటు, తాగొచ్చిన తండ్రి చిన్నతనంలో తనను కొట్టడం వల్ల కలిగిన మెదడు గాయం కారణంగా ఏర్పడిన వ్యాధితో బాధపడుతున్నాడని వాదిస్తూ అతడి తరఫున న్యాయవాదులు మరణశిక్షను తప్పించే ప్రయత్నం చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం మెక్ అలెస్టర్ పట్టణంలోని కారాగారం వద్ద ప్రాణాంతక సూది మందు ఇచ్చి గ్రాంట్ కు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో మూడు రాష్ట్రాలు స్వచ్ఛంద మారటోరియం విధించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more