దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఓ వైపు అధికార బీజేపికి దెబ్బ మీద దెబ్బ తాకుతున్నాయి.. నిన్న ఏకంగా గోవాకు చెందిన బీజేపి మంత్రి తన పదవికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకోగా ఆయన వెంట ఒకరు అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేకు కూడా అదే బాటన నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా, ఉత్తర్ ప్రదేశ్ లో మరోమారు యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం పీఠాన్ని అధిరోహించడం ఖాయమని బీజేపి నేతలతో పాటు సర్వేలు కూడా చెబుతున్నా.. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాత్రం ఆ నిజాలను అంగీకరించడం లేదు.
ఈ సారి రాష్ట్రంలో మళ్లీ సమాజ్ వాదీ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వసిస్తున్నట్లు వున్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఈ ఎలెక్షన్స్ ను సెమీఫైనల్స్ గా భావిస్తున్న తరుణంలో బీజేపికి కార్మికశాఖ మంత్రితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అదే బాటలో పయనించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు బీజేపి పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి తేరుకోలేని దెబ్బ తగిలింది. మౌర్యకు ఓబీసీ నేతగా యూపీలో ఎంతో గుర్తింపు ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలోని పద్రౌనా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మౌర్య ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ లో కార్మిక, ఉపాధి సమన్వయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏకంగా మంత్రి రాజీనామా చేయడం, ప్రధాన ప్రత్యర్థి పక్షం సమాజ్ వాదీ పార్టీలో చేరడం బీజేపీకి తీవ్ర నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపి.. దళితులకు ప్రాధన్యం ఇవ్వడం లేదని అరోపించారు. పార్టీ బిసిలతో పాటు దళితులను కూడా కేవలం ఓట్ల కోసం వాడుకుని తరువాత అణిచివేస్తోందని అరోపించారు. బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా దళితవర్గాలపై దాడులు అధికమయ్యాయని అన్నారు. ఇక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బాటలోనే ముగ్గరు ఎమ్మెల్యేలు కూడా పయనించారు. తిహార్ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ, బిల్హౌర్ ఎమ్మెల్యే బ్రిజేష్ ప్రజాపతి, తింద్వారీ ఎమ్మెల్యే భగవతి సాగర్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
బిసీలను, దళితులతో పాటు యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం యువతను, రైతులను కూడా విస్మరించిందని.. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో కూడా అర్థంకానీ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అరోపించారు. మౌర్య రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియాలో స్పందించారు. మౌర్యతో కలిసున్న ఫొటో పంచుకున్నారు. సామాజికనేతకు సాదరస్వాగతం అంటూ పార్టీలో చేరికను ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సమాజ్ వాదీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.కాగా, మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీ ఎంపీ. ఆమె బదౌన్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more