ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలోని తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తున్న మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కోట్ల రూపాయల నల్లధనం వ్యవహారాలు యధేశ్చగా సాగుతున్నాయని ఆదాయ పన్నుశాఖ అధికారులు తెలిపారు. గత బుధవారం రోజున ఈ మూడు సంస్థల్లో సోదాలు నిర్వహించినట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల ఐదు నుంచి నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు ఈ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏకంగా రూ. 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్టు పేర్కొంది. అలాగే, రూ. 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని వెల్లడించింది.
భూముల అభివృద్ధి, నిర్మాణాల వ్యాపారం చేస్తున్న మూడు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై దాడులు చేసిన ఆదాయశాఖ అధికారులు, వారికి సంబంధించిన ఏకంగా రెండు డజన్లకు పైగా స్థలాలపై జనవరి 5 నుంచి సోదాలు నిర్వహించారు. అటు కర్నాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యవహరాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాల, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఆదాయశాఖ అధికారులు దాడులు చేశారని తెలిపారు. దీంతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతోపాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు.
ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లు మరియు డిజిటల్ డేటా వంటి నేరారోపణ పత్రాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది. కాగా, నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్ఫ్రా, స్కంధానీ ఇన్ఫ్రా కంపెనీలు ఆస్తుల రిజిస్టర్డ్ విలువ కంటే ఎక్కువ "నగదు స్వీకరిస్తున్నట్లు" గుర్తించబడ్డిందని తెలిపారు. ఈ అక్రమ నగదును భూముల కొనుగోలు సహా ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏకంగా రూ. 800 కోట్ల వరకు ఖాతాలో లేని నగదు లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more