మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లుగా ప్రజలు కొరిన అభివృద్దిని అఘమేఘాల మీద చేపట్టేందుకు అక్కడి అధికారులకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందో ఏమో తెలియదు కానీ.. అధికారుల అవినీతి పర్వం మాత్రం తారాస్థాయికి చేరిందన్న అరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ అరోపణలు చేసింది ఆ రాష్ట్ర ప్రజలు అనుకుంటే పోరబాటే.. ఎందుకంటే అ అరోపణలు చేసి.. అధికారులు అక్కడికి వచ్చేలా చేసింది రాష్ట్రంలో కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని బీజేపి ఎమ్మెల్యే కావడం గమనార్హం.
ఎన్నికల వేళ సర్వసాధరనమైన ప్రారంభోత్సవాలు, శంఖుస్థానపలకు స్థానిక ఎమ్మెల్యేలను పిలవడం ఆనవాయిది. అయితే ఇదే ఆనవాయితి ప్రకారం రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆ బీజేపి మహిళా ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. కొత్తగా వేసిన రోడ్డును ప్రారంభించేందుకు వెళ్లిన ఆమె.. రోడ్డుపై కొబ్బరికాయ కోట్టింది. అయితే కొబ్బరికాయ పగలకపోగా ఏకంగా రోడ్డు పగులిచ్చింది. దీంతో రోడ్డు నాణ్యతపై ఆమె నోరెళ్లబెట్టారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ ఘటన జరిగింది. దీంతో రో్డ్డు నాణ్యత ప్రమాణాల పరీక్షల కోసం అక్కడే మూడు గంటల పాటు వేచివున్నారు.
ఘటనకు సంబంధంచిన వివరాల్లోకి వెళ్తే.. సదర్ నియోజకవర్గంలో 7.5 కిలోమీటర్ల మేర రోడ్డును ఇరిగేషన్ శాఖ రూ.1.16 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరిని ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి అధికారులు పిలిచారు. శుక్రవారం సాయంత్రం ఆమె పూజలు చేసి రోడ్డుపై కొబ్బరికాయ కొట్టారు. అయితే టెంకాయ పగలకపోగా రోడ్డు పగులిచ్చింది. దీంతో రోడ్డు నాణ్యతపై మహిళా ఎమ్మెల్యే సుచి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు.
మూడు గంటలపాటు అక్కడే ఉంచి రోడ్డు మెటిరియల్ శాంపిల్స్ను సేకరించి నాణ్యత పరిశీలన కోసం పంపారు. నాసిరకంగా రోడ్డు నిర్మించిన ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు తెలిపారు. మరోవైపు రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరుగలేదని బిజ్నోర్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వికాస్ అగర్వాల్ చెప్పారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు దర్యాప్తు జరుపాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు.
…. The MLA says she waited on the spot for three hours for a team of officers to arrive and take samples of the road to investigate. She has promised tough action against those responsible pic.twitter.com/zwDiioqIXu
— Alok Pandey (@alok_pandey) December 3, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more