డబ్బు ఎంతటి నీచానికైనా దిగజార్చుతుందని కొన్ని ఘటనలు నిరూపిస్తుంటాయి. ధనమ్ మూలం ఇదమ్ జగత్ అన్నారే కానీ.. మానవీయ వీలువలకు తిలోదకాలు ఇచ్చేలా చేసి.. మరి పాడుపనులకు పాల్పడతారని ఎవరూ ఊహించరు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో అలాంటి అమానవీయ ఘటనే జరిగింది. ఈజీ మనీ వేటలో తన మేనల్లుడి వరుసైన బాలుడిపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా మాజీ ప్రియుడితో లైంగిక చర్యల వీడియోలను తీసి మరీ.. బ్లాక్ మెయిలింగ్ కు ఒడిగట్టిందో యువతి. వీడియోలు బయట పెడతానంటూ ఏకంగా రూ.16 లక్షల మేర నగదు, డబ్బును కాజేసింది. పోలీసుల రంగప్రవేశంలో ఎట్టకేలకు కిలాడి జంట కటకటాలు లెక్కబెడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. టోలీచౌకిలో ఉంటున్న ఓ కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్లోని గాయిత్రి హిల్స్ కు మకాం మారింది. ఈ క్రమంలో అల్మారాలో ఉండాల్సిన రూ. 20 తులాల బంగారం, నగదు కనిపించలేదు. వెతికినా ఫలితం లేకపోవడంతో 9వ తరగతి చదువుతున్నకుమారుడిని తల్లి ప్రశ్నించింది. అయితే ముందుగా తెలియదు అని సమాధానం ఇచ్చిన బాలుడు.. తల్లి తన బంగారం డబ్బు పోయిందని అన్నం తినకుండా విలపిస్తుండటంతో.. తన తల్లి ఏడుపు చూడలేక నిజాన్ని చెప్పాడు. అసలు విషయం తెలుసుకున్న తల్లి విస్తుపోయింది. తమ సమీప బంధువైన యువతి ఇంతటి దారుణానికి ఒడిగడుతుందా.? అని పోలీసులను ఆశ్రయించింది.
తల్లితో బాధిత బాలుడు ఏం చెప్పాడంటే.. ఆల్మారాలోని 20 తులాల బంగారంతో పాటు డబ్బును తానే తీశానని, దానిని బెంగళూరులో ఉండే తండ్రి బంధువైన (వరుసకు మేనత్త) యువతికి ఇచ్చినట్టు చెప్పడంతో అందరూ షాకయ్యారు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా బాలుడు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు. బెంగుళూరులోని తన మేనత్త అప్పడప్పుడు తన కోసం వచ్చేదని, అయితే ఇంటికి కాకుండా ఏకంగా తాను చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చేదని చెప్పాడు. అలా ఒకరోజు తన కోసం వచ్చిన మేనత్త.. తనను చార్మినార్ లోని లాడ్జ్కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పాడు.
మాజీ ప్రియుడితో కలిసి దీనిని ఆమె వీడియో తీసిందని, ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించిందని చెప్పాడు. తనను బంగారం, డబ్బు తీసుకురావాల్సిందిగా ఒత్తిడి చేయడంతో.. భయపడి మరో గత్యంతరం లేక ఇంట్లోని 20 తులాల బంగారంతోపాటు రూ. 6 లక్షల నగదు ఆమెకు ఇచ్చేశానని వివరించాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై మూడుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more