టాలీవుడ్ హీరోలతో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. వందల కోట్ల మేర డబ్బును వసూలు చేసిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత శిల్పా చౌదరీని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బును చెట్లకు కాసేలా అధికవడ్డీ ఇస్తామని మాయమాటలు చప్పడంతో పాటు నల్లడబ్బును రూటు మార్చి సక్రమమైనదిగా తీసుకోస్తామని అనేక మందికి శఠగోపం పెట్టిన మాయలాడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెతో పాటు తన స్థాయిలో మోసాలకు పాల్పడిన అమె భర్తను కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
కిలాడి శిల్ప వలలో మోసపోయిన వారిలో ముగ్గురు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. మోసపోయినవారి జాబితాలో ఇంకా వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లు, రియాల్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు. డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ శిల్పపై పోలీసులకు బోలడన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రముఖుల పేర్లు చెప్పి మరీ శిల్ప మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అందాల్సి ఉంది.
ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసింది. సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు వారికి కుచ్చు టోపీ పెట్టిందామె. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లధనాన్ని మార్పిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్పి.. ప్రముఖుల్ని మోసం చేసింది. మోసపోయినవారిలో చాలా మంది బాధితులు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more