భూమ్మిద నూకలు ఇంకా వున్నాయరా.. నీకు.. అందుకనే ఎన్ని వెధవ వేషాలు వేసినా.. ఏమీ కాకుండా బతికిపోతున్నావ్ అంటూ ఎటకారంగా గ్రామాల్లోని పెద్దలు పిల్లలను మందలించడం సహజమే. అయితే ఇక్కడ ఈ వ్యాన్ డ్రైవర్ మాత్రం నిజంగా భూమ్మిద బియ్యం ఇంకా వున్నాయి కాబట్టే అత్యంత భయానక ప్రమాదానికి గురైనా.. వెంట్రుకవాసిలో మరణం అంచుల నుంచి తప్పించుకున్నాడు. అందులోనూ సరిగ్గా ఆయన తన పుట్టినరోజునాడే పునర్జన్మను పోందాడు. ఇద్దరు పిల్లల తండ్రైన అలెగ్జాండర్ ఈవాన్స్ నడిపించుకుంటూ వెళ్తున్న వాహనాన్ని శరవేగంగా వెళ్తున్న రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనకు లోనుకాగానే వ్యాన్ డ్రైవర్ తన ప్రాణాలు పోయాయని.. తనకు పుట్టినరోజునాడే మరణాన్ని కూడా పైవాడు రాసిపెట్టాడేమోనని భయాందోళనకు గురయ్యాడు. అంతేకాదు అంతలోనే తాను నడుపుతున్న వ్యాన్ ను ఢీకొట్టేలా వస్తున్న ప్యాసింజర్ రైలు వస్తోంది. దీంతో ఇదే తన చివరి క్షణం అనుకునేలోపు సృహ్కోల్పోయాడు. అంతే కొంత సేపటికి లేచి చూడగానే.. అంతా యధాతథంగా వుంది. దీంతో తాను చనిపోలేదని, తాను బతికే ఉన్నానని సంతోషపడ్డాడు. అయితే అదే సమయంలో తన వ్యాను మాత్రం రెండు ముఖ్కలైందని తెలుసుకుని సమాచారాన్ని తన కంపెనీకి అందించాడు.
ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో ఈ ప్రమాదం జరిగింది. అమెజాన్ డెలివరీ వ్యాన్ డ్రైవర్ అలెగ్జాండర్ ఎవాన్స్ అనే 33 ఏళ్ల యువకుడు డెలివరీ కోసం విస్కాన్సిన్ ప్రావిన్స్ కు బయలుదేరి వెళ్లాడు. మార్గమధ్యంలో మిల్వాకీ వద్ద ఎలాంటి నిడ్నళ్లు కానీ, రెడ్ లైట్స్ కానీ లేకుండానే రైల్వే ట్రాకులు వున్నాయని.. దాంతో వాటిపైకి తాను మామూలుగా వెళ్లిపోయానన్నాడు. ‘‘ట్రాక్పైకి వెళ్లేసరికి ఒక్కసారిగా రైలు శబ్దం. వెంటనే తేరుకుని వేగం పెంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే’’అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు. అన్నట్టు.. ఆ రోజునే అతడు 33వ ఏట అడుగుపెట్టాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more