అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రైవేట్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘క్రూ-3’ మిషన్ విజయవంతంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకుంది. ఈ మిషన్కు తెలుగు సంతతికి చెందిన రాజాచారీ నేతృత్వం వహించారు. నలుగురు వ్యోమగాములున్న క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. 22 గంటల అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన స్పేస్క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
క్రూ-3 మిషన్కు రాజాచారి కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్మెరైన్ అధికారి కేలా బారన్, నాసాకు చెందిన టామ్ మార్ష్బర్న్ పైలట్గా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్ వెళ్లారు. వీరు 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. మెటీరియల్ సైన్స్, హెల్త్ టెక్నాలజీ, అంతరిక్షంలో మొక్కల పెంపకంపై అధ్యయనం చేయనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 23నే ఈ ప్రయోగం జరుగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం గమనార్హం.
రాజాచారి అమెరికా వైమానిక దళంలో ప్రస్తుతం కర్నల్ హోదాలో ఉన్నారు. 1977లో జన్మించారు. విస్కాన్సిన్లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొందారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్కు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, చందమామపై అన్వేషణ కోసం నాసా చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘అర్టెమిస్’ మిషన్ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more