భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా మరోమారు శక్తికాంత దాస్ నే నియమిస్తూ క్యాబినెట్ అపాయింట్స్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మరో మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించనున్నారు. సాధారణంగా మూడేళ్ల పాటు ఉండే అర్భీఐ గవర్నర్ పదవిలో 2018లో శక్తికాంత్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మూడేళ్ల పదవికాలం ఈ డిసెంబర్ 10తో ముగియనుంది. ఈ తరుణంలో ఆయనను మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగించేలా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆయన మరో మూడేళ్ల పాటు అర్బీఐ గవర్నర్ గా కొనసాగనున్నారు.
శక్తికాంత దాస్ పునఃనియామకాన్ని అమోదించిన కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ.. ఆయన ఈ పదవిలో 10 డిసెంబరు 2021 నుంచి మూడేళ్ల పాటు అంటే 10 డిసెంబర్ 2024 వరకు లేదా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్గా కొనసాగుతారని స్పష్టం చేసింది. కాగా శక్తికాంత్ దాస్ ఈ పదవిలో పూర్తికాలం కొనసాగిన పక్షంలో ఆయన గత ఏడు దశాబ్దాల కాలంలో అత్యధిక కాలం అర్బీఐ గవర్నర్ గా కొనసాగిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. అయితే ఆయన నియామకంతో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిపుష్టి కోసం అమలవుతున్న ఆర్థిక విధానాలు యధావిధంగా కోనసాగుతాయన్న సంకేతాలను కూడా కేంద్ర దేశ ప్రజలకు అందించినట్లు అయ్యింది.
ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా గతంలో పనిచేసిన శక్తికాంత దాస్ 11 డిసెంబరు 2018లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీ అనుబంధంగా వున్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి పోస్టు గ్రాడ్యూయేట్ పట్టాను అందుకున్న శక్తికాంత్ దాస్.. ఆర్థిక, పన్ను, పారిశ్రామిక, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విభాగాలలో అటు రాష్ట్ర, ఇటు కేంద్ర స్థాయిలలో అనేక కీలక పదవులను నిర్వహించారు. అనేక పాలనాపరమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దోమధపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more