కరోనా మహమ్మారి విరుచుకుపడి లక్షలాది మంది ప్రాణాలను హరించిన కోట్లాది మందిపై ప్రభావం చాటిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటిు, ఎంఎన్సీ, చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీంతో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉద్యోగులు తమ విధులను హాజరై పనులు చేసుకుంటున్నారు. అయితే ఇలానే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన షమాయా లిన్ అనే మహిళ కూడా తాను పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో ఇంటి నుంచే ఆమె పని చేస్తోన్న అమె తన ఆఫీసు సహుద్యోగులతో జూమ్ కాల్ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె రెండేళ్ల కుమారుడు వెనగ్గా వచ్చాడు. అతనికి ఒక బ్యాగులో లోడ్ చేసిన తుపాకీ దొరికింది. దానిని పట్టుకుని వచ్చి నేరుగా తన తల్లి తలలో షూట్ చేసేశాడు. దీంతో షమాయా లిన్ కాల్ మాట్లాడుతుండగానే కుప్పకూలింది. అమె ముందుకు పడటాన్ని గమనించిన సహోద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ షమాయా అడ్రస్ ఆ ఉద్యోగినికి తెలియదు.
కాగా అదే సమయంలో షమాయా భర్త వియాండ్రే ఆవరీ కూడా తన భర్య రక్తపు మడుగులో పడిఉందని పోలీసులకు ఫోన్ చేశాడు. తాను ఇంటికొచ్చే సరికే షమాయా తన కంప్యూటర్ ముందు కుప్పకూలి ఉందని, రక్తపు మడుగు పడిఉందని ఆవరీ చెప్పాడు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే షమాయా మృతిచెందింది. ఈ ఘటన ఆగస్టు నెలలో చోటుచేసుకోగా ఇవాళ ఈ కేసును ఫ్లోరిడా న్యాయస్థానవం విచారించింది. ఈ సందర్భంగా తుపాకీని నిర్లక్ష్యంగా బ్యాక్ ప్యాక్ లో వదిలేసినందుకు ఆవరీని దోషిగా తేల్చిన న్యాయస్థానం అయనకు శిక్షను విధించనుంది.
కాగా అవరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తుపాకీని చిన్నారులు చేరుకుని.. దానిని వినియోగించేందుకు వీలుగా అన్ లాక్ చేయడాన్ని అవరీ తప్పుగానే న్యాయస్థానం పేర్కోంది. అలా వదిలేయడం వల్లే రెండేళ్ల పసివాడికి ఆ తుపాకీ దొరికిందని, అతను తల్లిని షూట్ చేశాడని పోలీసులు అంటున్నారు. కాగా అగ్రరాజ్యంలో విచ్చలవిడిగా వినియోగించేలా తుపాకీ సంస్కృతి రాజ్యమేలడంతోనే ఈ దారుణ ఘటన జరిగిందన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more