పండుగ పర్వదినాలలో సకుటుంబసపరివారి సమేతంగా సామాన్యులు పండుగను జరుపుకునేలా.. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా తాము ప్రత్యేక రైళ్లును పరుగులు పెట్టిస్తామన్న రైల్వేశాఖ సంతోషకరమైన వార్తను అందించింది. అయితే అదే సమయంలో ఈ సంతోషాన్ని ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక బాదుడు వుంటుందని తెలియజేసింది. దీంతో సోంత ఊళ్లకు వెళ్లి పండుగ వేడుకల్లో పాల్గోనాలన్న సామాన్యుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ ప్రయాణికులపై ఎనలేని భారం మోపుతోంది.
ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ. 200 నుంచి రూ. 700 వరకు భారం పడుతోంది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఈ నెల 14న హైదరాబాద్-విశాఖపట్టణం గరీభ్ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. దీంతో కొందరు అనేక వ్యయప్రయాసలు పడైనా వెళ్లాల్సింేద అనుకుంటుండగా, మరికోందరు మాత్రం పరిగెత్తి పాలు తాగడం కంటే.. నిలబడి నీళ్లు తాగడం ఎంతో మేలంటూ.. ఉన్నచోట పండుగ సంబరాలు చేసుకుందామని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more