కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎన్నికల ప్రచారమే గగనంలా తలపిస్తోంది. ఇప్పటికే కెనడాలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెనకంజలో పయనిస్తున్న ఆయనకు క్షేత్రస్థాయిలోనూ పరాభవం ఎదురవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటారియోలోని లండన్ నగరానికి చేరుకున్న ఆయనపై అందోళనకారులు రాళ్లదాడి చేశారు. ప్రధానితో పాటు బస్సులో ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్ చేసేందుకు వచ్చిన పాత్రికేయులకు కూడా స్వల్పగాయాలయ్యాయి. ఇదే క్రమంలో ట్రూడో లిబరల్ పార్టీకి ఈ ఎన్నికలలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తుంది.
కోవిడ్ వ్యాక్సిన్కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ప్రధాని ట్రూడోపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. చిన్నరాళ్లతో జరిగిన దాడిలో ఎవరూ గాయపడలేదు. కానీ ప్రధాని జస్టిన్తో పాటు ఆయన సిబ్బందిపై కూడా ఆ రాళ్లు పడ్డాయి. ఓ బ్రెవరీని విజిట్ చేసి తిరిగి తన బస్సులోకి వస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కోవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రచార సభకు అడ్డుతిరిగారు. ఇటీవల ఆందోళనకారుల వల్ల ఓ ర్యాలీని కూడా ఆయన రద్దు చేసుకున్నారు.
ఒంటారియోలో జరిగిన ఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారపర్వాన్ని తన లిబరల్ పార్టీని గెలిపించేందుకు ప్రచారబాధ్యతలు ఎత్తుకున్న తనపై రాళ్ల దాడి చేసి తనను బెదరగొట్టాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయని ట్రూడో అన్నారు. ఈ దాడిలో తన భుజంపై ఆ చిన్న రాళ్లు తగిలాయని, కానీ దాంతో బెదిరేదిలేదన్నారు. ప్రధానిపై రాళ్లు రువ్విన ఘటనను ప్రతిపక్ష నేత ఖండించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కచ్చితం టీకా వేసుకోవాలని ట్రూడో ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. దీన్ని యాంటీ వ్యాక్సిన్ ఆందోళనకారులు తప్పుపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more