తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటన ఆద్యంతం నిరసనలు, దాడుల నేపథ్యంలోనే సాగింది. అగర్తలా విమానాశ్రయంలో దిగిన ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై బీజేపి పార్టీ జెండాలను పట్టుకున్న కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో త్రిపురలోని అధికార బీజేపికి- తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య మళ్లీ అగ్గిరాజేసుకుంది. కాగా, బీజేపీ నేతలే తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్లో ఆరోపణలు చేశారు.
”బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఎంతటి ఉన్నత స్థాయికి చేరిందో ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. త్రిపుర ముఖ్యమంత్రి (విప్లవ్ దేవ్) మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ తన కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను అభిషేక్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తన కాన్వాయ్ పై జరిగిన దాడికి బీజేపి నాయకుల ప్రేరణే కారణమని ఆరోపించారు.
దేశంలో ఏ ప్రాంతానికి చెందిన నాయకుడైనా ఏ ప్రాంతంలోనైనా పర్యటించేందుకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం వుందని అన్నారు. అయితే త్రిపుర అధికార బీజేపి పార్టీలో మాత్రం తృణముల్ కాంగ్రెస్ నేతలు పేర్లు చెబితేనే జంకు పుడుతోందని.. అందుకు తమ పర్యటనలను అడ్డుకోవడానికి వారు చేస్తున్న దాడులే కారణమని టీఎంసీ నేతలు విమర్శించారు. కాగా, పొరుగు రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కారుపై దాడి చేయటాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Democracy in Tripura under @BJP4India rule!
— Abhishek Banerjee (@abhishekaitc) August 2, 2021
Well done @BjpBiplab for taking the state to new heights. pic.twitter.com/3LoOE28CpW
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more