కరోనా మహమ్మారి తన రూపాన్ని మార్చి ప్రజలను ఇబ్బందులను పెడుతుండగా, తాజాగా ఒకేసారి రెండు వేరియంట్లు ఒకే వ్యక్తిలో బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇలా రెండు వేరియంట్ల కరోనా వైరస్ సోకిన వారు విదేశాలలో అనేకులు వుండగా, మన దేశంలో మాత్రం తొలిసారిగా కరోనా డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంలో ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సైతం ధ్రువీకరించారు. అయితే, సదరు వైద్యురాలు ఇంతకు ముందే రెండో మోతాదుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.
రెండు వాక్సీన్ డోసులు తీసుకున్నా తరువాత కూడా అమె డబుల్ వేరియంట్ల ఇన్పెక్షన్ కు గురికావడం అందోళన కలిగిస్తోంది. వైద్యురాలికి ఒకే సారి రెండు వేర్వేరు వేరియంట్లు సోకినట్లుగా గుర్తించామని అమెకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. ఆమె రెండు మోతాదులు వ్యాక్సిన్ తీసుకున్నారని అసోం దిబ్రూగఢ్ జిల్లా లాహోవాల్ ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నోడల్ అధికారి బిశ్వాజ్యోతి బొర్కాకోటి చెప్పారు. ఇంతకు ముందు సదరు వైద్యురాలు కరోనా పాజిటివ్ గా పరీక్షించారని పేర్కొన్నారు. ల్యాబ్ లో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించామని తెలిపారు.
ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకిందని అయినా.. డబుల్ వేరియంట్ ను నిర్ధారించేందుకు రెండుసార్లు నమూనాలను సేకరించామని బిశ్వాజ్యోతి వివరించారు. అయితే, ఆమెకు తీవ్ర సమస్యలేవీ లేవని, స్వల్ప లక్షణాణలు ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతకు ముందు బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధ మహిళకు ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకాయి. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించగా.. గత మార్చిలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆ వృద్ధురాలు టీకా తీసుకోలేదని వైద్యులు తెలిపారు. అయితే, ఐసీఎంఆర్-ఆర్ఎంసీఆర్లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఏవీ గుర్తించలేదని బిశ్వజ్యోతి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more