మాటల్లో మర్యాద మాత్రమే కాదు.. మనస్సులో ప్రేమ కూడా గోదావరిలా నిత్యం ఉప్పోంగుతూనే ఉంటుందన్న నానుడిని నిజం చేశాడో మామగారు. పెళ్లి సందడి చిత్రంలో రాఘవేంద్రరావు పెళ్లి సన్నివేశాల్లో చూపించిన వెటకారం, ప్రేమ కొంతే అని.. నిజంగా గోదావరి జిల్లావారిని చూస్తే అది అంతకుమించి అని ఇట్టే అర్థమవుతుందని అంటున్నారు అక్కడి ప్రజలు. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్ నిబంధనలకు లోబడి అత్యత్ప సంఖ్యలోనే బంధువులతో కూతురికి వివాహం చేసిన తండ్రి.. తన కూతరుకి ఇచ్చ సారే మాత్రం టాక్ అఫ్ ది టౌన్ అయ్యేలా చేశారు.
అదెలా అన్న వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారి బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి.. యానాంకు చెందిన వ్యాపారవేత్త తోటరాజు కుమారుడు పవన్ కుమార్ కు ఈ ఏడాది జూన్ లో ఘనంగా వివాహం జరిగింది. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది బంధుమిత్రులను అహ్వనించకుండానే.. జరిపించేశారు. ఇంతలో ఆషాఢం రావడంతో బలరామకృష్ణ కుమార్తెకు సారె పంపారు. సారె అంటే అలాంటి ఇలాంటి సారె కాదు... తరతరాలు చెప్పుకునేలా ఘనంగా పంపారు. ఈ సారెను తీసుకుని కొన్ని లారీలు, జీపులు యానాంకు తరలి వెళ్లాయి.
ఇక అక్కడకు చేరిన సారె (కావిళ్ళు)ను భారీ ఊరేగింపు మధ్య వియ్యంకుల వారి ఇంటికి చేర్చారు. ఆ లిస్టు చదివితే మతిపోవడం ఖాయం. 100 రకాల మిఠాయిలు, 10 మేకపోతులు, టన్ను పండుగప్ప చేపలు, టన్ను కొరమేను చేపలు, 250 కేజీల బొమ్మిడాయిలు, 350 కేజీల రొయ్యలు, 50 పందెంకోళ్లు, 50బిందెలకొద్దీ తినుబండారాలు, పలు రకాలు ఫలాలు, 250 రకాల కిరాణా సామాన్లు, 200 జాడీల ఆవకాయ, టన్ను కూరగాయలు పంపారు. కోవిడ్ నిబంధనల కారణంగా తన కూతురి వివాహం ఘనంగా చేయలేకపోయానన్న తండ్రి తన కూతురికి ఘనంగా కావిళ్ళను పంపించాలని నిర్ణయించుకుని వాటిని సిద్దం చేయించి కుమార్తె మెట్టినింటకి పంపించారు. దీంతో ఔరా అనిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more