గ్రీన్ పాస్ పోర్ట్ స్కీమ్ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారతీయులను కూడా యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు ఓ వైపు విన్నవిస్తూనే మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారతీయులను యూరోప్ దేశాల పర్యటనకు అంగీకరించకుంటే, ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను సవరిస్తామని హెచ్చరించింది. ఇక దీనిపై మీరే తేల్చుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ యూరోపియన్ దేశాల్లో ఇస్తున్న అస్ట్రాజెనికా వాక్సీన్ ఒక్కటే అయినా ఆంక్షలను ఎందుకు పెట్టారన్నది అర్థంకావడం లేదు, ఇక ఫైజర్-బయోఎన్ టెక్ సారధ్యంలో రూపోందిన కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం కూడా తెలిసినా.. అటు ఫైజర్, ఇటు అస్ట్రాజెనికా వాక్సీన్లను అనుమతిస్తూ ఇండియాలో తయారైన కోవిషీల్డ్; కొవాగ్జిన్ లను ఎందుకు అమోదించడం లేదని ప్రశ్నించింది.
టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ అనుమతించిన టీకాలను తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటిల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సస్ టీకాలు ఉన్నాయి. ఇక ఇదే విషయమై భారత్ లో ఈయూ ప్రతినిధి ఉగో అస్టుటోను ప్రశ్నించగా, టీకాల విషయంలో ప్రతి అనుమతి పొందాలంటే, కొన్ని నిబంధనలను పాటించాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more