కరోనా ధర్డ్ వేవ్ పై దేశప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో థర్డ్ వేవ్ రాకుండా కేంద్రప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలను తీసుకుందని ఆయన ప్రశ్నించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కొవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు మోడీ సర్కార్ ఎలాంటి ముందస్తు నివారణ చర్యలకు పూనుకుందో దేశప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు, నిరోధానికి పెద్ద ఎత్తున ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు.
ఈ వేరియింట్ అత్యంత ప్రభావితమైనదన్న వార్తల నేపథ్యంలో దీనిని కట్టడి చేసే సామరధ్యం టీకాలు వుందా.? అయితే ఎంతమేర ప్రభావాన్ని టీకాలు చూపగలుగుతాయన్న వివరాలను కూడా ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పుడు లభిస్తుందని ఆయన ప్రశ్నలు సంధించారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు నియంత్రించే ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. దేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాలు బాధిత జిల్లాల్లో నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. డెల్టా లేదా B.1.617.2 వేరియంట్లోని మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ ఉత్పరివర్తనం చెందిందని.. అయితే దాని తీవ్రత ఇంకా తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more