కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దేశవ్యాప్తంగా పాన్ డమిక్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశాలు జారీ చేసిన వేళ.. నిబంధనలకు నీళ్లు వదిలిన విద్యావంతులు జిల్లాలను దాటి మారుమూల ప్రాంతాలకు చేరుకుని అక్కడ గ్రాండ్ పార్టీలను సెలబ్రేట్ చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వరుణ్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గా జన్మదిన వేడుకలను స్నేహితులు మధ్య ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నగరంలోని రేవ్ పార్టీలను తలదన్నే విధంగా ఈ పార్టీ జరిగిందన్న అరోపణలు వున్నాయి.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి హైదరాబాద్ లోని వివిధ కంపెనీలకు చెందిన 70 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు, అమ్మాయిలతో కలసి డీజే శబ్దాల్లో చిందులేస్తూ హోరెత్తించారు. అయితే ఈ వేడుకల్లో తన స్నేహితులకు కిక్ ఎక్కించేందుకు నిర్వాహకులతో కలసి వరుణ్ గౌడ్ బయట నుంచి యువతులను తెప్పించారని కూడా సమాచారం. వారితో కలసి తన స్నేహితులు మద్యం తాగిన మత్తులో చిందులేశారని పోలీసులు తెలిపారు. గ్రామస్థుల నుంచి అందుకున్న సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
రాత్రి 12 గంటల సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన కడ్తాల్ పోలీసులు బాక్స్ కంటైనర్ ఫాం హౌస్ పై దాడి చేశారు. ఫామ్ హౌజ్ లోని నిర్వాహకులతో కలసి మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే కీలక వ్యక్తులైన వరుణ్ గౌడ్ తో పాటు మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు నిర్వాహకులు వున్నారు. వారు కాకుండా పోలీసుల అదుపులో ఉన్నవారిలో 21 మంది యువతులు, 43 మంది యువకులు ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ పరారయ్యాడు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన యువతీయువకులను ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more