ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన తగ్గుముఖం పట్టడం లేదు. దాదాపుగా 40 రోజుల తరువాత ఇవాళ కేసుల సంఖ్య ఐదు వేలకు తక్కువగా నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, అరోగ్యశాఖ అధికారులకు కొంత ఊరటనిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 10తో ముగియనున్న కర్ఫ్యూను మరో పది రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులను పూర్తిగా నియంత్రించేందుకు ఇదోక్కటే మార్గమని భావించిన సర్కార్ ఆదిశగా నిర్ణయం తీసుకుంది.
అయితే రాష్ట్రంలో పూర్తిగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలాలను అందిస్తూ పది వేలకు పైగా నమోదైన కేసులు నాలుగు వేల సంఖ్యలో నమోదు కావడంతో.. ప్రస్తుతం వున్న ఆంక్షలను మరికొందగా విధిల్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నెల 11 నుంచి జూన్ 20 వరకూ పొడిగించిన కర్ఫ్యూలో భాగంగా.. జూన్11 నుంచి కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వున్న కర్ఫ్యూను మరో రెండు గంటల పాటు సడలింపునిచ్చింది.
దీంతో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూను సడలింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తాయని వెల్లడించింది. కరోనాను పూర్తిగా నియంత్రించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూ 2021, జూన్ 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూతో సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో..మరికొన్ని రోజులు పొడిగిస్తే బెటర్ అని భావించింది రాష్ట్ర ప్రభుత్వం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more