తెలంగాణలో ప్రభుత్వం సహా పోలీసు ఉన్నతాధికారుల నుంచి అదేశాలు లభించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారి వాహనాలను స్వాదీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. మరికోన్ని చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన అదేశాల నేపథ్యంలో వాహనదారులను అదుపులోకి తీసుకుని కొన్న గంటల తరువాత వారిని వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ వాహనదారుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనతో పాటు తన వాహనంపై నున్న తన సహచరుడి ప్రాణాలను బలిగొన్నాడు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ వద్ద జరిగిన ఈ ఘటనలో సహచరుడు కింద పడిపోయిన తరువాత కనీసం వాహనాన్ని నిలిపి అతడికి ఏమైందోనని కూడా వెనక్కి చూడకుండా వెళ్లిపోవడం వాహనదారుడిపై విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన పూర్వపరాల్లోకి వెళ్తే జిల్లాలోని లక్సెట్టిపేట వైపు నుంచి తపాల్ పూర్ వైపుకు వెళ్లేందుకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు స్నేహితులు వస్తున్నారు, అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు వాహనాలు వెళ్లకుండా తమ అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద అడ్డంగా గేటు వేశారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చెక్ పోస్టు వద్ద పోలీసులను చూసిన యువకులు భయపడ్డారు,
ఇక వీరి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ స్పీడు పెంచారు. అదే సమయంలో వారిని గమనించిన ఓ అటవీ శాఖ సిబ్బంది వారిని వాహనం నిలపాల్సిందిగా కోరుతూ.. వేగంగా వస్తున్న వారికి సైగా చేశారు. దీంతో మరింత కంగారుకు, అందోళనకు గురైన వాహనదారుడు మరింత స్పీడును పెంచాడు. అటవీ శాఖ సిబ్బందికి దిరికితే తమను పట్టుకుని అరెస్టు చేస్తారనో, లేక వాహనాన్ని జప్తు చేస్తారనో భయంతో వారికి చిక్కకుండా తప్పించుకోవాలని శరవేగంగా దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు, అంతే వాయువేగంతో వచ్చిన బైక్ గేటు వద్దకు రాగానే బైక్ నడిపై వ్యక్తి తన తలను కిందకు వంచాడు, అయితే ఇది గమనించని బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తికి గేటు బలంగా ఢీకొన్నింది.
అయితే ఏదో జరుగరానిదే జరుగుతుందని కీడు శంకించిన అటవీశాఖ సిబ్బంది చెక్ పోస్టు గేటును పైకి లేపే ప్రయత్నం చేసినా అది కూడా వృధా ప్రయాసగానే మారిపోయింది. అప్పటికే ఆలస్యం జరిగింది. బైక్ ను వేగంగా గేటు కిందినుంచి పోనివ్వడంతో తాను తల వంచి తప్పించుకున్నా.. తన వెనుకనున్న మిత్రుడు గురించి పట్టించుకోలేదు. దీంతో అతడి మెడకు గేటు బలంగా తాకడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ పట్టించుకోని బైకర్ అదే వేగంతో దూసుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన చెక్పోస్టు వద్దనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more