ఒకనాటి రాష్ట్ర రాజధాని ప్రాంతమైన కర్నూలు జిల్లాకు మణిలా వచ్చి చేరింది ఓ విమానాశ్రయం. జిల్లాలోని ఓర్వకల్లులో 1008 ఎకరాలలో నిర్మితమైనమైన ఈ విమానాశ్రయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్ధీప్ పూరీతో పాటుగా ఆయన విమానాశ్రయంలో తొలుత జాతాయ జెండాను ఎగురువేసి.. ఆ తరువాత విమానాశ్రయం టెర్మినల్ భవనం వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అవిష్కరించారు. ఆపైన నేరుగా విమానాశ్రయంలోకి కేంద్రమంత్రితో కలసి వెళ్లి విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కర్నూలుకు విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణాలు సాగించాల్సి వచ్చేదని, ఇక ఈ నెల 28 నుంచి విమాన ప్రయాణం కూడా అందుబాటులోకి రాబోతుందని అన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాల తరువాత కర్నూలు ఎయిర్ పోర్టు రాష్ట్రంలో ఆరవ విమానాశ్రయమని అన్నారు. ఈ నెల 28 నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అన్నారు.
ఇక ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేసిన ఆయన.. అందుకు గత విశిష్టతను కూడా తెలిపిరు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమం చేశారని, ఆయనకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. "ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు గతంలో ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారు" అని విమర్శించారు.
"మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశాం" అని జగన్ చెప్పారు. రూ. 153 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైన ఈ విమానాశ్రయానికి డీజీసీఏ సంక్రాంతి రోజున జనవరి 15న లైసెన్సు జారీ చేయగా, 27 సెక్యూరిటీ క్లియరెన్స్ లభించింది. 2 వేల మీటర్ల పోడువున, 30 మీటర్ల వెడల్పుతో రన్ వే కూడా నిర్మించారు. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను తీసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more