ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అటవిక న్యాయాలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. కులసంఘాలు, పెద్దలు అనాగరిక తీర్పులు, శిక్షలు దేశ న్యాయవ్యవస్థనే సవాలు చేసేలా వున్నాయి. భర్తను వదిలి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోందన్న కారణంగా ఓ గిరిజన మహిళకు అమె కుటుంబసభ్యులు వేసిన శిక్ష దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వీడియోలో నెట్టింట్లో పెను సంచలనంగా మారడంతో కేసును నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన చర్యలు తీసుకుని అమెకు శిక్ష వేసిన నలుగురిని అరెస్టు చేశారు.
ఈ మహిళను గ్రామానికి తీసుకువచ్చిన అమె అత్తింటివారు.. సదరు మహిళ భుజాలపై అమె మరిదిని ఎక్కించి గ్రామంలో ఊరేగించారు. ఈ మేరకు అమెకు ఈ శిక్షను విధించారు గ్రామ పెద్దలు. ఇలా ఆమె దాదాపు మూడు కిలోమీటర్లు తన మరిదిని భుజాలపై మోసుకుంటూ నడిచింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో ఉంటోంది.
దీంతో గ్రామస్థులు ఆమె అత్తింటివారితో కలిసి ఆమెకు బుద్ధి చెప్పాలని ఆటవిక న్యాయంతో వ్యవహరించి శిక్షను విధించారు. అమె తన భర్త సోదరుడ్ని (మరిదిని) తన భుజాలపై మోస్తూ శిక్ష అనుభవించాలని చెప్పడంతో ఆమె వారిని ఎదిరించలేకపోయింది. కాళ్లకు చెప్పులు లేకుండా తన మరిదిని తన భుజాలపే ఎక్కించుకుని ఏకంగా మూడు కిలోమీటర్లు మేర ఊరేగించేలా చేశారు. అమె చుట్టూ చేరిన మె బంధువులలోని మగవారు.. అమె వెంట కర్రలు చేతబట్టి మరీ నడిచారు.ఈ దృశ్యాలను కొందరు స్మార్ట్ ఫోన్లలో తీసి జరిగిన అన్యాయాన్ని నెట్టింట్లో పోస్టు చేశారు.
ఓ గిరిజన మహిళ పట్ల అమానవీయ రీతిలో శిక్షను విధించిన గ్రామ పెద్దలు, కుల పెద్దలు.. తీసుకున్న నిర్ణయాన్ని నెట్టింట్లో ప్రశ్నించారు. అంతేకాదు ఆమెను అవమానిస్తూ గ్రామస్థులు, అత్తింటివారు పాల్పడిన ఈ ఘటనను వివరించారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఇంకేముందు అలా పోలీసులకు కూడా సమాచారం అందింది. దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుణ జిల్లా ఎస్సీ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ ఘటన ఈ నెల 9న జరిగిందని, అయితే తాను జిల్లా ఎస్పీగా 10న బాధ్యతలు చేపట్టానని, అయినా కేసును సత్వర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more