పల్నాడు ఫాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన మరో కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హతమార్చారు. అయితే టీడీపీ నేత హత్యతో ఒక్కసారిగా గుంటూరులో కలకలం రేగింది. రాజకీయ అధిపత్యం కోసం ఈ హత్యలు జరుగుతున్నాయా.? గుంటూరు జిల్లాలో ఫాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయా.? అన్న అనుమానాలు రేగుతున్నాయి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ కీలక నేత పురంశెట్టి అంకులు (65) హత్య స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయ వుందన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు నిన్న సాయంత్రం ఓ ఫోన్ కాల్ రావడంతో రాత్రి 7 గంటల సమయంలో ఒంటరిగా దాచేపల్లి వెళ్లారు. కారును రోడ్డుపై పార్క్ చేసి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ పైకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే మొదటి అంతస్తులో హత్యకు గురయ్యారు. పైకి వెళ్లిన అంకులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పైకి వెళ్లి చూడగా, అక్కడ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. హత్యను నిరసిస్తూ అద్దంకి-నార్కట్ పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు.
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని హత్యపై ఆరాతీశారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, పెదగార్లపాడు వైసీపీ నేతలు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. మరోవైపు, హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకులు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ సహా పలువురిని విచారిస్తున్నారు. పెదగార్లపాడుకు చెందిన అంకులు పదేళ్లపాటు సర్పంచ్ గా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ కూడా సర్పంచ్ గా పనిచేయగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more