తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణపై విపక్షాల విమర్శలు మిన్నంటాయి. అయితే తాము తమ సొంతంగా ఏదీ చేయడం లేదని, భారత ప్రభుత్వం సహా ఐసీఎంఆర్ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయినా ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. కరోనా పరీక్షలు చేయకుండా.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. కరోనాతో అసుపత్రులలో చేరి మరణించిన వారి మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. లక్షణాలు లేని హైరిస్క్ ఉన్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ పరీక్షలు చేస్తున్నారని నిలదీసింది. రాష్ట్రంలో మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది హైకోర్టు.
అంతేకాదు పీపీఈ కిట్లను ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో చెప్పాలని సూచించింది. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం రాసిన రెండు లేఖలను కూడా అందజేయాలని స్పష్టం చేసింది. జూన్ 4 లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కాగా, సోమవారం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకాం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1920 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,284 మంది కోలుకోగా.. 57 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 650 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more