nearly 7,000 new Coronavirus Cases In India in 24 hours దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 7వేల కొత్త కేసులు

Coronavirus update covid 19 cases in india reach 1 38 lakh nearly 7 000 new cases in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India recorded the biggest spike in daily COVID-19 count as states had registered 6,977 fresh cases in last 24 hours. India overtook Iran to become the 10th nation among the countries worst-hit by coronavirus pandemic. The total number coronavirus patients in the country stood at 138,845. Death toll has increased to 4000 after 154 patients passed away.

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 7 వేల కొత్త కేసులు

Posted: 05/25/2020 10:50 AM IST
Coronavirus update covid 19 cases in india reach 1 38 lakh nearly 7 000 new cases in last 24 hours

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన 111 రోజులకు లక్ష మార్కును చేరిన కరోనా కేసులు.. ఆ తరువాత వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా గడిచిన 24 గంటల్లో అందుకోవడం అందోళనను రేకెత్తిస్తోంది. ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా వారం రోజుల క్రితం నిలిచిన భారత్.. తాజా కేసుల నమోదుదో పదవ స్థానానికి చేరడం కలవరంపరుస్తోంది. దేశంలో మూడో విడత లాక్ డౌన్ సమయంలో సగటున రోజుకు నాలుగు వేల మందికి వైరస్ వ్యాప్తి చెందగా, నాలుగో విడతలో ఈ సంఖ్య మరింతగా పెరగడం అంతోళన కలిగిస్తోంది.  

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు వేల కేసులు నమోదయ్యాయి, 6977 కొత్త పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,38,845 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 154 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4000కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 55,000 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 77,000మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి మరణిస్తున్న వారిలో మన దేశంలో 3.6శాతంగా వుందని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రెండు వేల కేసులు నమోదు కావడంతో పాటు దేశంలో నమోదైన కేసుల్లో మూడింట ఒక్క వంతు కేసులు ఇక్కడే నమోదు కావడం.. ఆ సంఖ్య యాభై వేల మార్కు దాటడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. ఈ రాష్ట్రంలో ఏకంగా 1635 మరణాలు సంభవించగా, నిన్న ఒక్కరోజునే ఈ రాష్ట్రంలో 108 మరణాలు సంభవించడంలో అందోళన రేపుతోంది. మహారాష్ట్ర తరువాత 16277 కేసులతో తమిళనాడులో కరోనా కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles