కరోనా’ బాధితులకు అందుతున్న చికిత్సా విధానాలతో పాటు వారికి వైద్య సేవలందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నారో ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకు ముంబై మేయర్ పెద్ద సాహసమే చేశారు. కరోనా వైరస్ ఎంతటి ప్రమాదకారో ఇప్పటివరకు మనం చూశాం. పలు దేశాలలో రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్లు కూడా కరోనా సోకిన ఘటనలు అనేకం. చైనా మొదలుకుని అనేక దేశాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనాలోని వూహాన్ లో చికిత్స చేసిన వైద్యులు మృత్యువాతపడిన ఘటనలు కూడా నమోదైన విషయం తెలిసిందే.
అలాంటి కరోనా మహమ్మారి ప్రభావం బారిన పడి చికిత్స కోసం అసుపత్రిలో చేరిన అనేక మంది రోగుల పరిస్థితి ఎలా వుందో ప్రత్యక్షంగా చూసేందుకు ముంబై మేయర్ సాహసం చేశారు. కరోనా చికిత్సా వార్డులలో పని చేస్తున్న వారికి లేదా పని చేసిన వారి ఇబ్బందులు ఏవిధంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఆమె ఈ సాహసానికి ఒడిగట్టారు. ఒకప్పుడు నర్సుగా పని చేసిన అనుభవం నేపథ్యంతో అమె ప్రస్తుత ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్ ను ఇవాళ సందర్శించారు.
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుపుతున్న ఈ హాస్పిటల్ కు ఆమె నర్సు యూనిఫాంలో వెళ్లారు. ఆసుపత్రి సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, గతంలో తానూ నర్సుగా పనిచేశానని, ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. నర్సింగ్ సిబ్బందికి ధైర్యం చెప్పేందుకే తాను నర్సు యూనిఫాంలో వెళ్లానని, ప్రస్తుత సంక్షోభ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలిచి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more