కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నారని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ స్వైరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలోనూ జగన్ ప్రభుత్వం.. కేవలం రాజకీయాల కోసమే పనిచేస్తోందని మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని విమర్శించారు.
‘పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో కిట్ ధర 730 రూపాయలు ప్లస్ జీఎస్టీ అని ఇచ్చారు. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి 640 రూపాయలు అని చెబుతారు. సాక్షి పత్రికలో మాత్రం ఏప్రిల్ 9న కిట్ ధర 12 వందల రూపాయలకు మెడ్టెక్ జోన్లో తయారు చేస్తున్నట్లు వార్త రాశారు. మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రాశారు. టెస్టింగ్ కిట్లు కొనుగోలు విషయంలో ఇంత గందరగోళం ఎందుకు. ఛత్తీస్గఢ్లో మాత్రం రూ.337 ప్లస్ జీఎస్టీ చొప్పున కొరియా నుంచి కొన్నారని కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు.
దీనిపై తాను ట్వీట్ చేస్తే గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు విజయసాయిరెడ్డి స్పందించారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి.. సూట్ కేసులు, బెయిల్ పిటీషన్లు మాత్రమే తెలిసిన వ్యక్తికి తనపై విమర్శలు చేసే నైతిక అర్హత వుంటుందా.? అని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేయటం ఆకాశంపై ఉమ్మి వేయటమేనని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విషయాల్లో గందరగోళం గురించి ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డికి ఎందుకు అందలా రియాక్ట్ అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయనకు వచ్చే కమిషన్ పోయిందని బాధపడుతున్నారా అని కన్నా మండిపడ్డారు.
చంద్రబాబు తనను కొన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతారా?. తనను కొనే వారు పుట్టలేదని ఆయన తేల్చిచెప్పారు. ‘అధికార మదంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఈ విషయంలో క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నానని చెప్పిన ఆయన.. విజయసాయిరెడ్డి పై పరువు నష్టందావా వేస్తానన్నారు. ఏపీలో ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడేందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్పారు. అధికారం ఉందని కేసులు పెడతామని బెదిరిస్తారా? అంటూ ప్రశ్నించారు. మీరు చెప్పిన విషయాల్లో వాస్తవం ఏమిటని అడగడం తప్పా అని నిలదీశారు. దక్షిణ కొరియా కంపెనీ శాఖ ఢిల్లీలో ఉండగా... నామినేషన్ పద్ధతిలో కిట్లు ఆర్డర్ ఇవ్వటం ఏంటిని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more