బాలీవుడ్ గాయని కనికా కపూర్.. ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డారు. ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది. క్రితం నాలుగు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆమె అక్కడే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రతికూల రిపోర్టులే వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న కనికా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం దీని గురించి మాట్లాడుతూ ఆసుపత్రిలోకి వైద్య సిబ్బందికి కనిక బాగా సహకరించారు. కరోనాను ఎదుర్కోవడానికి తాను ఎలాంటి తంత్రాలు ఏవీ ప్రయోగించలేదని అన్నారు. ఒక భయంకరమైన క్రిమితో యుద్ధం చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదు’’ అని అన్నారు. కాగా కనికా కపూర్ ను సూపర్ స్పెడర్ గతంలో అమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేశారని.. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అమెను కలిశారన్న వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా అమె ఓక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని, అంతేకాకుండా పలు పార్టీలలో అమె పాల్గోన్నారని కూడా సమాచారం. ఈమె ఇచ్చిన విందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుందరా రాజే.. అమె తనయుడు దుష్యంత్ సింగ్ లు కూడా హాజరయ్యారు. అంతేకాదు రాష్ట్రపతిని కలసిని బీజేపి ఎంపీల బృందంలో దుష్యంత్ సింగ్ కూడా వున్న నేపథ్యంలో స్వయంగా రాష్ట్రపతి కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. కాగా మొత్తానికి కనికా కపూర్ కు కరోనావైరస్ లో నెగిటివ్ రావడం సంతోషకరం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more