ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో అలాంటి ఘటనలు ఏపీలో జరగకుండా కొత్త చట్టాన్ని, చట్టంతోపాటు కొ్త్తగా ఠాణాలను తీసుకువచ్చింది. అయినా.. ఏపీలో మాత్రం అబలలపై మానవ మృగాళ్ల అకృత్యాలకు అంతులేకుండా, అదుపులేకుండా పోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తన స్నేహితుడిపై దాడి చేసి తమ కాలేజీ యువతి అన్న కనీస ఇంకితం కూడా లేకుండా దారుణంగా అఘాయిత్యానికి తెగబడ్డారు. అమెపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాల్లో మండపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు అమె స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్లింది. ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేందుకు సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అయితే వీరిని గమనించిన కాలేజీకి చెందిన నలుగురు యువకులు.. వారిని వెంబడిస్తూ ఇటుకట బట్టీ సమీపానికి వచ్చేశారు. అక్కడ చేరుకోవడంతోనే ఆ పరిసరాల్లో ఎవరూ లేరని గమనించారు.
అంతే తమ స్నేహితుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కాగా, జరిగిన దారుణం నేపథ్యంలో పోలీసులకు చెప్పాలా వద్దా.? అన్న మిమాంసలో వుండిపోయిన యువతి.. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబు తనపై దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలతో మార్పులు రావని పలువురు చర్చించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more