అన్నదాతకు అండగా ఉండడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని భావిస్తుంది. 1998లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా వున్న సమయంలో ఈ పథకానికి అంకురార్పణ జరగింది. అయితే ఆ తరువాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం దీనిని అమలు పర్చలేదు.
దీంతో ఈ పథకం పక్కకు పోగా.. యూపీపీ దీని స్థానంలో రైతులతో పాటు గ్రామీణులకు పనికి అహారపథకాన్ని తీసుకువచ్చారు. కాగా, రెండో దఫా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకం దుమ్ముదులిపింది. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆచరణలోకి తీసుకురావాలని తలచింది, ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లో ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 25లక్షల మంది రైతులకు కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది. అసలు కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. ఈ కేసీసీ స్కీమ్ కింద అర్హులైన అన్నదాతకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు. అంటే పావలా వడ్డీ పడుతుంది. అయితే తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లించాలి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది.
భారతీయ స్టేట్ బ్యాంకు నిబంధనలు ప్రకారం.. తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లిస్తే.. అప్పుడు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు అప్పు తసుకోవచ్చు. రైతులు గతంలో తీసుకున్న అప్పు కరెక్ట్ టైమ్కి కడితే అప్పు మళ్లీ వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు అప్పు పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more