తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు సబర్మతి ఆవ్రమం వద్ద ఘనస్వాగతం లభించింది. జాతిపిత మహాత్మగాంధీ నివసించిన నివాసం ప్రధాని నరేంద్రమోడీ, ఆశ్రమ ప్రతినిధి ట్రంప్ దంపతులకు ఆత్మీయ స్వాగతం పలికారు. రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం ఆశ్రమంలో గాంధీ చిత్రపటానికి నూలు మాలవేశారు. ఆశ్రమం అంతా కలియతిరిగి అక్కడి విశిష్టతను తెలుసుకున్నారు.
ట్రంప్ దంపతులు గాంధీ నివాసంలోని అణువణువూ తిప్పి అక్కడి ప్రత్యేకతలను, విశిష్టతలను ప్రధాని వారికి వివరించారు. ఈ క్రమంలో గాంధీ ప్రతి రోజు గంట సమయం పాటు చరఖా తిప్పేవారని తెలిపారు. ఈ క్రమంలో వారు నేలపై కూర్చోని.. గాంధీజీ తిప్పిన చరఖా తిప్పి నూలు వడికడం విశేషం. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న మూడు కోతుల సందేశాత్మక విగ్రహాలను మోదీ వారికి చూపించారు. వీటిని జపాన్ కు చెందిన సాధువులు గాంధీజీకి బహుమానంగా ఇచ్చారని, దీంతో అవి అధిక ప్రాచుర్యాన్ని పోందాయని చెప్పారు. ఈ బోమ్మల వెనుక వెనుక ఉన్న సందేశాన్ని వివరించారు. తర్వాత సందర్శకుల పుస్తకంలో ట్రంప్, మెలనియా తమ సందేశాలను రాసి సంతకం చేశారు.
అంతకుముందు భాతర దేశ తొలి పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ట్రంప్ దంపతులకు మోదీ సాదర స్వాగతం పలికారు. ట్రంప్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర అధికారులతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. విమానాశ్రయంలో గుజరాత్ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. అనంతరం విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ కిలోమీటర్ల మేర దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దారి పొడవునా వివిధ ప్రాంతాల్లో భారతీయ సంప్రదాయ, జానపద నృత్యాలతో కళాకారులు అడుగడునా నీరాజనం పలికారు. ట్రంప్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో అహ్మదాబాద్ నగరం జనసంద్రంగా మారింది. తొలుత ట్రంప్, ప్రధానిమోదీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వీరు మోతెరా స్టేడియానికి వెళ్లనున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా నగరమంతా ఎటు చూసినా మోదీ, ట్రంప్ ప్లెక్సీలతో నిండిపోయింది. అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వాహనంలో కూర్చున్న ట్రంప్ .. ప్రజలకు అభివాదం చేశారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more