కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు నిత్యపెళ్లికొడుకు అన్న విషయం భక్త జనకోటికి తెలిసిందే. తిరుమలలో శ్రీనివాసుడి కళ్యాణం చేయించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. తాజా ఉత్తర్వులు మేరకు ఇక దంపతులకు ఇచ్చే ప్రసాదంలో కోత పడింది. స్వామివారి నిత్యకళ్యాణంలో పాల్గోన్న దంపతులకు గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక చక్కని ఆనవాయితినీ కల్పించింది. వెంకట రమణుడి రమనీయమైన కళ్యాణంలో పాల్గోన్న దంపతులకు ఏ ఆర్జిత సేవకు లేని విధంగా పైపంచ, జాకెటు పీసును ఇస్తోంది టీటీడీ.
దీంతో పాటు స్వామివారి కళ్యాణోత్సవంలో జరిపిన భక్తులు.. స్వామివారి దర్శనం చేసుకన్న తరువాత ప్రత్యేక కౌంటర్ల వద్ద ఇచ్చే ప్రత్యేక ప్రసాదంలో కోత విధించి.. ప్రసాదం కావాలంటే అదనపు రుసుం చెల్లించాలని షరతు విధించింది. స్వామివారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూల విషయంలో ధరలు పెంచినా భక్తజనం నిమ్మకుండటంతో టీటీడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. తిరుమలకు చేరుకునేందుకు అనేక వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తుల నెత్తిన శఠగోపాలు పెట్టడం ఎందుకని.. భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరు కోరినా కోరకున్నా భక్తులు ముడుపులు కట్టి శ్రీవారి హుండీలో వేస్తున్నారని.. అయినా ఈ అదనపు ఆంక్షలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అసలు విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. ఇదివరకు స్వామివారి కళ్యాణం చేసిన దంపతులకు 2 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 2 వడలను దేవస్థానం ప్రసాదంగా అందించేంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై రెండు చిన్న లడ్డూలను మాత్రమే ఇస్తూ కోతపెట్టింది. అంతేకాదు 2 పెద్ద లడ్డూలు, ఐదు చిన్న లడ్డూలు.. రెండు వడలు ఏకంగా పాత పద్దతిలోనే ప్రసాదం కావాలంటే మాత్రం అదనంగా ఆరువందల రూపాయలు చెల్లించాలని భక్తులకు షరతు పెట్టింది. ఇలా షరత్తు పెట్టే కన్నా స్వామి వారి అర్జిత కళ్యాణ సేవకు ధరను పెంచివుంటే బాగుండేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
ప్రసాదం కావాలంటే తప్పనిసరిగా ఆరు వందలు చెల్లించాలని ప్రసాదాన్ని విడిగా చేసి.. కళ్యాణోత్సవాన్ని విడిగా చేయడం.. కళ్యాణ ప్రసాదానికి వున్న పవిత్రతను, ప్రాశస్త్యాన్ని తగ్గించమే అవుతుందని అంటున్నారు భక్తులు. ఏళ్లుగా కళ్యాణం జరిపే భక్తులకు వస్తున్న ఆనవాయితీకి జగన్ సర్కార్ తిలోదకాలు ఇప్పించడం సహేతుకంగా లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవారి మనోభావాలను పట్టించుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ఏం చేస్తామని నిట్టూర్చుతూ.. అదనపు డబ్బును చెల్లించి ప్రసాదాలను తీసుకుంటున్నాం’ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more