హైదరాబాద్-తిరువనంతపురం మధ్య వయా గుంటూరు నడిచే శబరి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. డిపార్చర్ పాయింట్ లో మార్పులతో పాటు రైలు బయలుదేరే సమయంలోనూ మార్పులు జరిగాయి. ఈ నెల 27 నుంచి ట్రెయిన్ టైమింగ్స్ లో మార్పులు మొదలువుతాయి. హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుంచి ఇన్నాళ్లుగా ప్రారంభమయ్యే శబరి ఎక్స్ప్రెస్ ఇకపై హైదరాబాద్ నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు కొత్త షెడ్యూల్కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.
ఈ రైలు 27 నుంచి సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరుతుంది.. సాయంత్రం 5 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి బయల్దేరి సికింద్రాబాద్ వచ్చే శబరి ఎక్స్ప్రెస్.. ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు వస్తుంది.. మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు ప్రయాణీకులు ఈ మార్పుల్ని గమనించాలని చెబుతున్నారు. అంతక ముందు శబరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరేది.. కానీ ఆ స్టేషన్ను తగ్గించి.. సికింద్రాబాద్ నుంచి నడుస్తుంది.
ధర్మవరం-విజయవాడ ఎక్స్ప్రెస్ రైలు దారిమళ్లింపు
ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల నుంచి వయా నంద్యాల ద్వారా విజయవాడకు వెళ్లే దర్మవరం ఎక్స్ప్రెస్ రైళ్లను జనవరి 26 వ తేదీనుంచి డైవర్షన్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ట్రైన్ నెంబరు 17216 ధర్మవరం గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లే రైలును ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, గూడూరు మీదుగా విజయవాడకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. అంటే నంద్యాలకు బదులు రేణిగుంట మీదుగా దారిమళ్లించారు.
అలాగే ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే ట్రైన్ నెంబర్ 17215 కూడా విజయవాడ, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి మీదుగా ధర్మవరం వెళ్లనున్నది. ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు డివిజన్లో నాన్ఇంటర్లాకింగ్ సిస్టం పనులు నిర్వహిస్తునందువల్ల ఈరైలును వయా రేణిగుంట మళ్లిస్టున్నట్లు తెలిసింది. అయితే ఈ డైవర్షన్లో మద్యలో వచ్చే రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగకపోవచ్చునని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more