ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు గత 24 రోజులుగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల్లో అందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కాగా శుక్రవారం అందులోనూ పౌర్ణమి కావడంతో ఈ ఉదయం గ్రామస్థులు గ్రామదేవత పోలేరమ్మకెు మొక్కులు చెల్లింపుకునేందుకు ఆలయానికి తరలిరావడంతో వారిని పోలీసలు అడ్డుకున్నారు. దీంతో మందడంలో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి గ్రామస్థులను ఆలయంలో పూజలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి అసలు భక్తులను వెళ్లనీయకుండా అనుమతిని నిరాకరించి ఆలయాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మహిళా భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యం పెట్టుకోడానికి పోలీసులు అనుమతి తీసుకోవాలా.? అంటూ మహిళలు నిలదీశారు.
పోలీసుల ఆంక్షలతో అమ్మవారికి పూజలు నిర్వహించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మందడంలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో వున్నాయని మైక్ ద్వారా పోలీసులు ప్రచారం చేయడం.. పోలీసులు భారీగా మోహరించడం యుద్దవాతావారణం నెలకొంది. అటు రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన మహిళలను గ్రామశివారల్లో పోలీసులు అడ్డుకున్నారు.
తాము దైవదర్శనానికి వెళ్తున్నామని ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కాదని, తమకు అనుమతివ్వాలని మహిళలు పోలీసులను వేడుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, విరమించుకోవాలని చెప్పడంతో మహిళలు... పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దైవదర్శనం చేసుకోవడానికి కూడా పోలీసులు ఆంక్షలు పెడితే సహించమని మహిళలు గట్టిగానే చెప్పారు. అయినా పోలీసులు వారి పాదయాత్రకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో తమను అడ్డుకున్న పోలీసులను పట్టించుకోకుండా మహిళలు ముందుకు కదిలారు.
అంతే తమను లక్ష్యపెట్టకుండా ముందుకు సాగుతారా అంటూ మహిళలపై లాఠీ ఛార్జి చేశారు. పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. తమను పోలీసులు గ్రామనిర్భదం చేయడం సముచితంగా లేదని వారు అక్షేపించారు. పోలీసు జులుం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతికావాలా? అని నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more