అమరావతిలోనే రాజధానిని కోనసాగించాలని.. రాష్ట్రానికి ఏకైక రాజధాని మాత్రమే ముద్దని డిమాండ్ చేస్తూ గత నెల 17 నుంచి ఉద్యమబాట పట్టి.. అమరావతి ప్రాంత రైతులు గడిచిన మూడునాలుగు రోజులుగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం తమను అసలు పట్టించుకోకుండా పెయిడ్ అర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసి.. కించపరుస్తున్న క్రమంలో మానసిక అందోళనకు గురైన మరో రైతు గుండె అగింది. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు.
ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన తనకున్న 0.50 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
రాజధాని రైతు మరణించాడనే వార్త తెలియడంతో గ్రామ ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా రైతు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృపానందం కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేసిన నారా లోకేష్.. రాజధాని కోసం ఆందోళనలతో రైతు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి మూర్ఖపు నిర్ణయాలకు వెళ్లకుండా రాజధాని ప్రాంత రైతుల గొంతును కూడా వినాలని నారాలోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు.
.@ysjagan గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది.(1/2) pic.twitter.com/UUMZgPWYxd
— Lokesh Nara (@naralokesh) January 8, 2020
వైకాపా నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిది. (2/2)
— Lokesh Nara (@naralokesh) January 8, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more