ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతి పరిధిలో ఎక్కడ చూసిన రైతులు అందోళనబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాల అమరావతిలోని సచివాలయానికి వస్తున్న తరుణంలో అమరావతి పరిధిలో పోలీసులు అంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా అమరావతి సచివాలయానికి చేరుకునే ప్రధాన మార్గంలో వున్న మందడం గ్రామంలో పోలీసులు అంక్షలు మరింత తీవ్రంగా వున్నాయి. దీంతో పోలీసులు సీఎం రాక నేపథ్యంలో గ్రామంలో అప్రకటిత కర్ప్యూ వాతావరణాన్ని సృష్టించారు.
మందడంలోని అన్ని వ్యాపార సంస్థలను, దుకాణాలను మూసివేయించిన పోలీసులు గ్రామస్థులు రోడ్డపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే నామమాత్రంగా మెడికల్ షాపులను మినహా అన్ని దుకాణాలను బంద్ చేయిస్తున్నారు. ఈ నెలలో సచివాలయంకు వెళ్తున్న జగన్ కాన్వాయ్ రాగానే జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకారులు నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో మందడం గ్రామంలో మహిళలు ఆందోళనలు నిర్వహించారు.
కొందరు ఇళ్ల వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు నిర్వహించారు. దీంతో ఉన్నాతాధికారులు స్థానిక పోలీసు అధికారులకు క్లాస్ తీసుకున్నారని, దీంతో ఇవాళ మరోమారు సీఎం వైఎస్ జగన్ అమరావతిలోని సచివాలయానికి వెళ్తున్న నేపథ్యంలో మందడంలో మరోమారు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా గ్రామస్థులపై అంక్షలు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది. జగన్ సచివాలయానికి వెళ్లిన తరువాతే భోజనాలు చేయాలని పోలీసులు చెబుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి జగన్ రాక నేపథ్యంలో మందడం గ్రామంలోని హోటళ్లు, టీ స్టాళ్లులను కూడా పోలీసులు తెరవనీయడం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. కాగా, ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more