అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అసువులు బాసారు. టెనస్సీ రాష్ట్రంలోని నాష్ విల్లేలో థ్యాంక్స్ గివ్వింగ్ డే రోజున (నవంబర్ 28) జరిగిన ఈ దుర్ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిలో ఒకరు తెలుగు విద్యార్థి. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గత నెల 28న ధ్యాంక్స్ గివ్వింగ్ డే సందర్భంగా టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ అఫ్ అగ్రికల్చర్ లో ఫుడ్ సైన్స్ డిగ్రీని చదువుతున్న జైడీ స్టాన్లీ (23) తో పాటుగా తెలుగు విద్యార్థైన వైభవ్ గోపిశెట్టి (26)లు తమ కారులో బయటకు వెళ్లారు. కాగా వీరు ప్రయాణిస్తున్న కారును డేవిడ్ టోరెన్ అనే వ్యక్తి తన ట్రక్కుతో ఢీకొట్టాడు. ట్రక్కు కారును వెనుకగా బలంగా ఢీకోనడంతో దుర్ఘటనాస్థలంలోనే వారు మరణించారు. ట్రక్కును నడిపిన డేవిడ్ టోరిస్ (28) ఆ వెంటనే పరారీలోకి వెళ్లాడు. తరువాత ఈ నెల 1న పోలీసుల ముందు లోంగిపోవడంతో ప్రమాదం జరగిన విషయం పోలీసులకు తెలియవచ్చింది.
కాగా తమ ఇద్దరు సహచరుల ఆకస్మిక మృతి పట్ల అందోళన చెందిన టెనస్సీ విశ్వవిద్యాలయం విద్యార్థులు.. వారిద్దరి బౌతిక కాయాలను భారత్ పంపించేందుకు, అక్కడ దహన సంస్కారాలను చేపట్టే నిమిత్తం 42 వేల డాలర్లు గో ఫండ్ మి పేజీ ద్వారా విరాళాలను రాబట్టారు. ఇక ఆ కళాశాల అసిస్టెంట్ ఫ్రోఫెసర్ భారత్ పోహ్రాల్ తన పేస్ బుక్ పేజీలో ఇద్దరు విద్యార్థుల మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారు చాలా అనుకువ, అమాయక, శ్రమించే యువకులని, ఇద్దరికీ భవిష్యత్తుపై చక్కని అవగాహన వుందని, అయితే బావి వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదిగే వీరిని మృత్యుశకటం కబళించి వేసిందన్న వార్తను నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more