జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతం కావడం.. ఆ తరువాత ప్రభుత్వం కూడా దిగివచ్చి ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు బలవన్మరణాలకు పాల్పడిన భవన నిర్మాణ రంగంలోని కార్మికుల కుటుంబాలకు పరిహారంగా రూ.5లక్షలు అందిస్తామని ప్రకటించడం.. ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్లక్షానికి కారణాలే అయినా.. పరోక్షంగా మాత్రం పవన్ కల్యాన్ జనసేన విజయాలేనని చెప్పకతప్పదు.
వీటి తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జగన్ సర్కార్ ను ఓ వైపు టార్గెట్ చేస్తూనే వున్న జనసేనాని.. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని కూడా ట్వీట్ చేయడం.. తెలుగు బాష కేంద్రం నిధులు తీసుకువచ్చేందుకేనా అని కూడా ప్రశ్నించారు. తాజాగా పవన్ కల్యాణ్ అద్భుత మెజారిటీతో ప్రజలు అధికారాన్ని అందిస్తే దానిని మార్పుకు వినియోగించకుండా.. కేవలం రంగులు మార్చడానికి వినియోగించడమేంటని పవన్ కల్యాణ్ వేసీపీ సర్కార్ ను నిలదీశారు.
విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఘటనపై మండిపడ్డారు. 'వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???' అని పవన్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. కాగా, ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా , ఈ రోజు గాంధీజీ,రేపు ఎవరు
— Pawan Kalyan (@PawanKalyan) November 22, 2019
శ్రీ జగన్ రెడ్డి జీ ???
(This happened in Hon.Min Sri Bothsa Sathyanarayana ji’s Vijayanagaram district,A.P) pic.twitter.com/jlyQbYYuT7
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more