ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రికి బ్యాంకు అధికారులు షాక్ ఇవ్వనున్నారు. ఆయనకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి త్వరలో గంట మ్రోగించనున్నారు. ఇంతకీ ఆయన ఎవరనేగా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ మాజీ మంత్రి రుణం పోంది.. రుణంతో పాటు వడ్డీని కూడా చెల్లించకపోవడంతో రుణ ఎగవేతదారుడిగా (డీఫాల్టర్ గా) వున్నారు. దీంతో ఆయన ఆస్తులు వేలానికి బ్యాంకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న వేలం నిర్వహించాలని బ్యాంకు నిర్ణయించినట్లు సమాచారం. సుమారు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఆయన రుణం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన కంపెనీ ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం పొందారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన రుణ ఎగవేతదారుడికి బ్యాంకు ముద్రవేసింది. దీంతో ఆయన రుణం పోందేందుకు బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేస్తున్నట్లు చెబుతున్నారు. రుణ బకాయిలు సుమారు రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు. మిగతా బకాయిల కోసం ఆయనకు చెందిన వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే యోచనలో బ్యాంకు అధికారులు వున్నారని ఆయా వర్గాల సమాచారం.
ఇదిలావుండగా, ప్రభుత్వ భూములను కూడా తనఖా పెట్టి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా తన పరపతిని వినియోగించి భారీగా రుణాలు పొందారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలుతో ఇండియన్ బ్యాంకులో తనఖా పెట్టిన అస్తులకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు వెల్లడించారు. తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తులన్నీ ప్రైవేటు ఆస్తులేనని తెలిపారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more