పెళ్లితో ఒక్కటయ్యే తమ బిడ్డను వరుడు జీవితాంతం తోడుగా, నీడగా వుంటూ అమె యోగక్షేమాలు చూసుకుంటాడని పూర్వం వరుడికి లాంఛనంగా ముట్టజెప్పిన కొద్ది డబ్బు.. ఇప్పుడు ఏకంగా వరకట్నంగా రూపాంతం చెంది.. ఎంతో మంది అడపడచుల జీవితాలను అగాంధలోకి నెడుతుండగా, మరెందరో జీవితాలను అర్థంతంగా ముగింపు పలికింది. అంతకుముందున్న కన్యాశుల్కం స్థానంలో వచ్చిన ఈ వరకట్న మహమ్మారిని సమూలంగా పెకిలించివేయడానికి ఎంతో మంది కృషి చేస్తున్నా.. ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినా.. నశించకుండా క్యాన్సర్ వ్యాధిలా విస్తరిస్తూనే వుంది.
ఇక ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని ఎందరో భర్తలు తమ భార్యలను హింసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అగ్రరాజ్యం వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి పామరుల వరకు ఈ మహమ్మారి అవహించిందంటే అతిశయోక్తి కాదు. కొందరు తమకు రావాల్సిన కట్నం కోసం పంచాయితీలు పెడితే.. మరికొందరు తమకు తక్కువ కట్నం ఇచ్చారని.. ఇంకా కావాలని అదనపు కట్నం కోసం పోరు పెడుతుంటారు. అయితే ఇప్పుడు మీరు చదివేది ఇలాంటి కోవకు చెందిన ఓ భర్త గురించే. కష్టపడి పోషించే స్థాయి లేదని భావించిన వాడు ఊరికే కట్నం డబ్బు వస్తోందని పెళ్లికి తయారయ్యే మగాళ్లు.. మొగుళ్లెలా అవుతారో.. అన్న ప్రశ్నలు వీరిని గురించి చదివిన తరువాత ఉదయించక మానవు.
డబ్బుపై మోజుతో కట్టుకున్న భార్యపైనే అత్యంత హీనంగా ప్రవర్తించాడో భర్త. అదనపు కట్నం కోసం అమెకు పెళ్లైన నాటి నుంచి నరకం చూపుతున్నాడు. అది చాలదన్నట్లు తాజగా అమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. భర్తే తన భార్యను బ్లాక్ మెయిల్ చేసే పాడు కాలం వచ్చేసింది. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన భర్త.. ఆపై దానిని ఆమెకు చూపించి అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. తీసుకురాకుంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగిందీ. స్థానిక శ్రీనివాసరావుపేటకు చెందిన యువతికి, తాడికొండకు చెందిన యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పెళ్లైన నాటి నుంచి అమెను అదనపు కట్నం కోసం శారీరికంగా, మానసికంగా హింసిస్తూనే వున్నాడు. అయితే భార్య కూడా అతడితో తెగేసి.. తాను ఇకపై డబ్బు తీసుకురాలేనని చెప్పడంతో అతనికి దిక్కుతోచలేదు.
దీంతో తన భార్యకు ఎలాగైనా గట్టిగా బుద్ది చెప్పి.. అత్తారింటి నుంచి అదనపు కట్నం తెచ్చుకోవాలని పథకం వేశాడు. అయితే ఇక్కడ అమె తన భార్య అన్న విషయాన్ని మర్చిపోయి దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా అమె వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా అమెకు దానిని చూపించి బెదిరించసాగాడు. అదనపు కట్నం తీసుకురాకుంటే ఆమె వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. భర్త చేష్టలతో నిర్ఘాంతపోయిన భార్య.. తన భర్త అకృత్యాన్ని స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more