తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కాబోయే వాడితో సరదాగా గడిపేందుకు వెళ్లిన యువతి తిరిగిరానీ లోకాలకు తరలివెళ్లింది. జనవరిలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కాబోయేవాడు పక్కనే వుండి కాపాడేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. త్వరలో ఒక్కటి కావాల్సిన ఈ జంటను విడదీసింది మాత్రం సెల్ఫీనే. సెల్పీ దిగేందుకు ఓ పాత దిగుడు బావిలోకి దిగిన యువజంట.. సెల్సీ దిగుతూ ప్రమాదవశాత్తు యువతి కాలు జారి బావిలో పడి మృతి చెందింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టాభిరామ్ ప్రాంతంలోని గాంధీనగర్కు చెందిన టి మెర్సీ స్టెఫీ, అదే ప్రాంతంలోని నవజీవన్ నగర్కు చెందిన డి అప్పూలకు ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. జనవరిలో స్టెఫీ, అప్పూ పెళ్లి చేసుకోబోతున్నారు. పెద్దల కుదిర్చిన ఈ వివాహం నేపథ్యంలో ఇద్దరు ఒకర్నోకరు అర్థం చేసుకునేందుకు సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. అలా వెళ్తూన్న క్రమంలో అప్పూను తమ పోలానికి తీసుకువెళ్లాలని భావించింది స్టెఫీ. వందలూరు-మింజూరు రోడ్డులో ఉన్న కండిగై గ్రామంలోవున్న వారి పొలానికి తీసుకెళ్లింది. ఆ పొలం పరిసరాల్లో ఓ పాత బావి ఉంది.
బావి పాతది కావడంతో లోపలికి దిగేందుకు మెట్లు కూడా ఉన్నాయి. ఆ బావి వద్ద ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన రావడమే ఈ జంట పాలిట శాపంగా మారింది. బావిలోకి దిగి చెరో మెట్టుపై కూర్చుని సెల్ఫీ దిగుతుండగా.. స్టెఫీ బావిలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అప్పూ కూడా బావిలో పడిపోయాడు. బావిలో పడగానే... భయంతో అప్పూ సాయం కోసం బిగ్గరగా ఏడుస్తూ కేకలేశాడు. ఆ అరుపులు విన్న పక్కనే పొలం ఉన్న రైతు బావిలో దూకి అప్పూను కాపాడాడు. వెంటనే స్టెఫీని కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ.. దురదృష్టవశాత్తూ అప్పటికే స్టెఫీ చనిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more