ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దుమారం కొనసాగుతోంది. ఇసుక కొరత వల్ల నిర్మాణపు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భవననిర్మాణ కూలీ ఆత్మహత్య కలకలం రేపింది. ఇసుక కొరతపై ప్రతిపక్ష టీడీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇసుక కొరత నెలకొందని ఆరోపిస్తోంది. ఇసుక కొరతను నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ ధీక్ష.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.
నారా లోకేష్ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి లోకేష్ దీక్షలో కూర్చున్నారు. ఇసుక ప్యాకెట్లను దండలుగా వేసుకుని టీడీపీ నేతలు దీక్షకు దిగారు. నారా లోకేష్ మెడలో నల్లకండువా కప్పుకుని నిరసన తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో గుంటూరు కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తూనే గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ సర్కార్ తెచ్చిన నూతన విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రతరమైంది. గత కొద్ది నెలలుగా ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.
గతంలో ఇసుక ట్రాక్టర్ ధర రూ.2 వేల లోపు ఉండేదని, ఇప్పుడు అది రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పలుకుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంటే పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోతోందని చెబుతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. అధికార పార్టీ నేతలు జేబులు నింపుకునేందుకు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more