వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. సీనియర్ రాజకీయ నేత రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తారు. దీంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల పనితీరుకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన స్పందించారు. విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. విద్యుత్తు కోతల నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లేక కేంద్రంలోని ప్రభుత్వంపైనా.. లేక ప్రధాని మోదీపైన నెట్టినా ఉపయోగం ఉండదని, అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుందన్నారు.
ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా జరగని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి మెజారిటీ చూసుకుని శాశ్వతం అనుకోవద్దని, ఎమ్మెల్యేలను కూడా సంతృప్తి పర్చాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే తనకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఫీలవ్వాలన్నారు. లేకుంటే అసంతృప్తి పెరుగుతుందన్నారు. వైసీపీది జాతీయ పార్టీ కాదని, ప్రాంతీయ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.
జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీ మనుషులే మీ మీద తిరగబడతారని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. 51 శాతం ఓట్లతో 1972లో కాంగ్రెస్ 219 సీట్లు సాధిస్తే తొమ్మిది నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావును దింపేశారన్నారు ఉండవల్లి. అలాగే 1994లో ఎన్టీఆర్, కమ్యునిస్టులు కలసి పోటీ చేసి 54 శాతం ఓట్లతో 213 సీట్లు సాధిస్తే తొమ్మదినెలలకు ఎన్టీ రామారావును ఎమ్మెల్యేలు పదవి నుంచి దించేశారన్నారు. జగన్ కూడా ఇది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఉండవల్లి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more