దేవుడి దర్శనానికని ఆలయానికి వెళ్తే.. మార్గమధ్యంలో మాటేసిన మానవమృగాలు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగ్గట్టాయి. స్నేహితులతో కలిసి వెళ్తున్న బాలికను బలవంతంగా లాక్కుపోయి మరీ అత్యాచారానికి తెగబడ్డాయి. అంతటితో ఆగకుండా మైనర్ బాలికపై దాడికి కూడా పాల్పడ్డాయి. ఈ పైశాచిక మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక అర కిలోమీటరు దూరం వరకు నగ్నంగా పరిగెత్తాల్సి వచ్చింది. అమె అరుపులు విన్న స్థానికులు అమెను రక్షించి.. మద్యం మత్తులో జోగుతూ దారుణాలకు ఒడిగట్టుతున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ రాష్ట్రం భీల్వాడాలో ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు దుర్మార్గులు మధ్యలో వారిని అడ్డగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆమె స్నేహితులు పారిపోగా, బాలికను నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకు వెళ్లారు. ఈలోగా తప్పించుకుని పారిపోయి వచ్చిన స్నేహితులు స్థానికంగా ఉన్న ఓ దుకాణ యజమానికి జరిగిన విషయం తెలిపారు. వారితో కలసి ఘటనాస్థలానికి చేరుకున్న దుకాణ యజమాని దుండగులు బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్టు గ్రహించాడు.
కాగా నిర్మానుష్య ప్రాంతానికి మైనర్ బాలికను తీసుకువచ్చిన అగంతకులు అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. వారి చిత్రహింసలకు తట్టుకోలేని బాలిక వారి నుంచి తప్పించుకుంది. అయితే ఆ సమయంలో ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేకపోయింది. అయినా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అర కిలోమీటరు దూరం నగ్నంగా పరుగెత్తుకువెళ్లింది. అక్కడ బాలికకు నివాస ప్రాంతం కనబడటంతో అమె గట్టిగా అరిచింది.
తనను రక్షించమని ఓ బాలిక అరుపులు విన్న స్థానికులు బయటకు వచ్చి అమెను అదుకున్నారు. అమెకు ముందుగా దుస్తులు ఇచ్చిన స్థానికులు ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకున్నారు. అమె తల్లిదండ్రుల వివరాలను కూడా సేకరించారు. ఈ లోగా మరికోందరు మైనర్ బాలికకు జరిగిన దారుణ ఘటపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు అగంతకులను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. భాదిత మైనర్ బాలికను చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more