తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో హస్కీ అనే 11 నెలల శునకం మరణానికి కారణమయ్యారంటూ వైద్యుడితో పాటు అసుపత్రి నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవడంపై యావత్ తెలంగాణ విస్తుపోయిందంటూ కాంగ్రస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శునకానికి జ్వరం వచ్చి మరణిస్తే వైద్యులపై కేసు నమోదు చేయడం పట్ల ఆయన తనదైన శైలిలో వెటకారంగా స్పందించారు.
మాట మాట్లాడితే తాను తెలంగాణ ప్రజల పక్షానే వున్నానని, వారి కోసమే అలోచిస్తాననే ముఖ్యమంత్రి తన ప్రగతి భవన్ లో శునకానికి ఇచ్చిన విలువను బంగారు తెలంగాణలో ప్రజలకు ఇవ్వడం లేదన్న సత్యాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. డెంగ్యూ, ఫ్లూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా సహా పలు రకాల వైరల్ జ్వరాలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఆయన తనదైన శైలిలో సెటూర్ వేశారు.
ఓ వైపు ప్రజలు రోగాలతో, రోష్టులతో అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కుక్క చనిపోతే మాత్రం పోలీస్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. అలాగే తన ట్వీట్ కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.
ప్రగతి భవన్ లో కుక్క కు ఉన్న విలువ బంగారు తెలంగాణ లో మనుషులకి లేదా? @TelanganaCMO @ts_health @TelanganaHealth pic.twitter.com/cNSkqfzfpQ
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2019
అంతకుముందు నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటామని పేర్కొన్న ఆయన.. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. సురభి నాటకాలు కట్టిపెట్టి తొలుత యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more